Ind VS Aus Latest Updates: ఆసీస్ టూర్ కు రెండు గ్రూపులుగా భార‌త్ జట్టు.. ఈనెల 15న ప్ర‌యాణం.. 19 నుంచి వ‌న్డే సిరీస్ ప్రారంభం.. జ‌ట్టుతో చేర‌నున్న రోకో జంట‌

1 month ago 3
ARTICLE AD
<p><strong>Rohit Sharma VS Virat Kohli: &nbsp;</strong>దాదాపు 7 నెల&zwnj;ల విరామం త&zwnj;ర&zwnj;వాత టీమిండియా వ&zwnj;న్డేల&zwnj;ను ఆడ&zwnj;నుంది. ఈనెల 19 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వ&zwnj;న్డేల సిరీస్ ను ఆడ&zwnj;నుంది. ఈ సిరీస్ లో దిగ్గ&zwnj;జ ప్లేయ&zwnj;ర్లు రోహిత్ శ&zwnj;ర్మ&zwnj;, విరాట్ కోహ్లీ బ&zwnj;రిలోకి దిగుతారు. అయితే ఆసీస్ ప&zwnj;ర్య&zwnj;ట&zwnj;న&zwnj;కు భార&zwnj;త్ రెండు బృందాలుగా వెళ్ల&zwnj;నున్న&zwnj;ట్లు తెలుస్తోంది. ఈనెల 15న ఉద&zwnj;యం ఒక బృందం, సాయంత్రానికి మ&zwnj;రో టీమ్ బ&zwnj;య&zwnj;లు దేర&zwnj;నున్న&zwnj;ట్లు స&zwnj;మాచారం. న్యూఢిల్లీ నుంచి భార&zwnj;త జ&zwnj;ట్టు ఆస్ట్రేలియాలోని పెర్త్ న&zwnj;గ&zwnj;రానికి చేరుకోనుంది. తొలి వ&zwnj;న్డే వేదిక పెర్త్ కావ&zwnj;డంతో నేరుగా అక్క&zwnj;డికే బ&zwnj;య&zwnj;లు దేర&zwnj;నున్న&zwnj;ట్లు తెలుస్తోంది. కేవ&zwnj;లం వ&zwnj;న్డేలు మాత్ర&zwnj;మే ఆడుతున్న కోహ్లీ, రోహిత్.. 14న లేదా 15న టీమ్ తోక&zwnj;లిసి చేర&zwnj;తారని బోర్డు వ&zwnj;ర్గాలు తెలిపాయి. అయితే ఇలా రెండుజ&zwnj;ట్లుగా వెళ్ల&zwnj;డానికి గల కార&zwnj;ణాలు ఇలా ఉన్నాయి. ఆరోజు బిజినెస్ క్లాస్ టికెట్లు త&zwnj;గిన&zwnj;న్ని లేక&zwnj;పోవ&zwnj;డంతో విడ&zwnj;త&zwnj;ల వారీగా టీమిండియాను పంపిస్తున్న&zwnj;ట్లు తెలుస్తోంది. కోహ్లీ, రోహిత్ ల&zwnj;తోపాటు శ్రేయ&zwnj;స్ అయ్య&zwnj;ర్ జ&zwnj;ట్టుతో ఢిల్లీలోనే క&zwnj;లుస్తాడ&zwnj;ని తెలుస్తోంది.&nbsp;</p> <p><strong>షార్ట్ బ్రేక్..</strong><br />ఇక ఆసీస్ ప&zwnj;ర్య&zwnj;ట&zwnj;న&zwnj;కు ఎంపికైన ఆట&zwnj;గాళ్లు.. తాము ఆడుతున్న మ్యాచ్ లు అంత&zwnj;కుముందే ముగిసిన&zwnj;ట్లయితే చిన్న&zwnj;పాటి బ్రేక్ ఇచ్చేందుకు బోర్డు అంగీక&zwnj;రించింది. కొంత స&zwnj;మ&zwnj;యానికి త&zwnj;మ ఇంటికి వెళ్లి, మ&zwnj;ళ్లీ ఢిల్లీకి రావాల&zwnj;ని బోర్డు ఆదేశించింది. ఇక వెస్టిండీస్ తోరెండోటెస్టు ఈనెల 10-14 మ&zwnj;ధ్య ఢిల్లీ వేదిక&zwnj;గానే జ&zwnj;రుగుతుంది. అన్నీ అనుకున్న&zwnj;ట్లు జరిగితే, నిర్ణీత స&zwnj;మ&zwnj;యం క&zwnj;న్నా ఈ మ్యాచ్ కూడా త్వ&zwnj;ర&zwnj;గా ముగిసి పోతుంది. దీంతో టెస్టు ప్లేయ&zwnj;ర్లకు కాస్త స్మాల్ బ్రేక్ వ&zwnj;చ్చే అవ&zwnj;కాశ&zwnj;ముంది. ఆసీస్ ప&zwnj;ర్య&zwnj;ట&zwnj;న&zwnj;కు కొత్త కెప్టెన్ తో భార&zwnj;త్ ఆడుతున్న సంగ&zwnj;తి తెలిసిందే. రోహిత్ నుంచి శుభ&zwnj;మాన్ గిల్ కు ప&zwnj;గ్గాల&zwnj;ను బీసీసీఐ అందించింది. ఇప్ప&zwnj;టికే టెస్టు కెప్టెన్ గా ఇంగ్లాండ్ టూర్లో ఐదు టెస్టులు ఆడిన అనుభవం గిల్ కు ఉంది.&nbsp;</p> <p><strong>గంభీర్ పార్టీ..</strong><br />త&zwnj;న సొంత&zwnj;గ&zwnj;డ్డ అయిన ఢిల్లీలో క్రికెటర్ల&zwnj;కు పార్టీ ఇచ్చేందుకు గంభీర్ సిద్ధ&zwnj;మ&zwnj;య్యాడు. స్నేహ&zwnj;పూర్వ&zwnj;క సంబంధాల&zwnj;ను కొన&zwnj;సాగించే నేప&zwnj;థ్యంలో గంభీర్ పార్టీ ఇవ్వ&zwnj;నున్న&zwnj;ట్లు తెలుస్తోంది. ఇక ఆసీస్ ప&zwnj;ర్య&zwnj;ట&zwnj;న గంభీర్ కు స&zwnj;వాలుతో కూడుకున్న&zwnj;ద&zwnj;న&zwnj;డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ టూర్లో మూడు వ&zwnj;న్డేలు, 5 టీ20ల&zwnj;ను భార&zwnj;త్ ఆడ&zwnj;నుంది. ఇక కేవ&zwnj;లం వ&zwnj;న్డేలు మాత్ర&zwnj;మే ఆడుతున్న కోహ్లీ, రోహిత్ ల&zwnj;కు ఇది చాలా ముఖ్య&zwnj;మైన సిరీస్. అభిమానులు ముద్దుగా రోకో జోడీ అనే పిలుచుకునే ఈ జోడీ.. దీనిలో రాణించాల్సిన అవ&zwnj;స&zwnj;రం ఇద్దరికీ ఉంది. అప్పుడే తాము ఆశిస్తున్న&zwnj;ట్లుగా 2027 వ&zwnj;న్డే ప్ర&zwnj;పంచ&zwnj;క&zwnj;ప్ లోవారిద్ద&zwnj;రూ బ&zwnj;రిలోకి దిగేందుకు ఆస్కారం ఏర్ప&zwnj;డుతుంది. ఇక 2023 వన్డే ప్రపంచకప్ లో ఓడిన తర్వాత ఈ ఏడాది యూఏఈలో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 12 ఏళ్ల తర్వాత ఈ కప్పును సాధించి ఫుల్ జోష్ లో ఉన్న ఇండియా.. అదే జోరును ఆసీస్ టూర్లోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉంది.&nbsp;</p>
Read Entire Article