ICC Champions Trophy: హైబ్రీడ్ మోడల్ - ఇకపై పాక్‌తో మ్యాచ్‌లకు భారత్‌కు ఆ ప్లస్ పాయింట్ ఉండబోదు, ఐసీసీ నిర్ణయంపై అభిమానుల ఆవేదన

11 months ago 8
ARTICLE AD
<p><strong>Ind Vs Pak:</strong> వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి అనేక తర్జనభర్జనల మద్య గ్రీన్ సిగ్నల్ లభించింది. ముఖ్యంగా టోర్నీ నిర్వహించే పాకిస్థాన్&zwnj;లో భారత్ పర్యటించబోనని తేల్చడంతో టోర్నీ నిర్వహణ సందిగ్ధంలో పడింది. అయితే భారత్ ఆడే మ్యాచ్&zwnj;లను తటస్థ వేదికపై నిర్వహించాలనే డిమాండ్&zwnj;ను బీసీసీఐ ముందుకు తెచ్చింది. చాలాకాలం మల్లగుల్లాలు పడిన తర్వాత ఐసీసీ ఈ నిర్ణయానికి ఓకే చెప్పింది. అయితే ఇక్కడే పాకిస్తాన్ మెలికపెట్టింది. దీని ద్వారా రోబోయే ఐసీసీ, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే ఆసియా కప్ టోర్నీల్లో భారత్&zwnj;కు ఉండే సానుకూలత మిస్సయ్యే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.&nbsp;</p> <p><strong>ద్వైపాక్షిక సిరీస్&zwnj;లు కట్..</strong><br />నిజానికి 2008 ముంబై దాడుల తర్వాత సీమాంతర ఉగ్రవాదానికి పాక్ కేంద్రం అయిందనే భావనతో ఆ దేశంతో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను బీసీసీఐ తెంచుకుంది. అప్పటి నుంచి ఆ దేశంలో ఇండియా ఆడలేదు. అయితే 2012లో మాత్రం మనదేశంలో పాక్ పర్యటించింది. ఆ తర్వాత ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్&zwnj;లు జరగలేదు. కేవలం ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లోనే ఇరుజట్లు పోటీపడ్డాయి. &nbsp;ఇక చివరిసారిగా 2005లో టీమిండియా పాక్&zwnj;లో ఆడగా.. ఆ తర్వాత నుంచి ఐసీసీ, ఆసియా కప్ (ఏసీసీ టోర్నీ)ల్లో తటస్థ వేదికపైనే పాక్&zwnj;తో భారత్ తలపడుతోంది. అయితే భారత్ ఆతిథ్యం ఇచ్చిన టోర్నీల్లో మాత్రం పాక్ మన దేశానికి వచ్చి ఆడుతోంది. అయితే ఇకపై ఈ పరిస్థితి ఉండబోదని తాజాగా తేటతెల్లమైంది. తమ దేశంలో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి భారత్ హాజరుకాకపోతే, భారత్&zwnj;లో జరిగే టోర్నీలో కూడా తాము ఆడబోమని, తాము కూడా తటస్థ వేదికల్లోనే ఆడతామని పీసీబీ మెలికపెట్టింది. దీనికి తప్పనిసరి పరిస్థితుల్లో జై షా నాయకత్వంలోని ఐసీసీ బోర్డు అంగీకరించింది. దీంతో ఇకపై సొంతగడ్డపై పాక్&zwnj;తో భారత్ మ్యాచ్&zwnj;ల నిర్వహణ ఉండదు.&nbsp;</p> <p><strong>Also Read:</strong> <a title="&lt;strong&gt;Kohli Vs Media: ఆసీస్ మీడియాపై కోహ్లీ గుస్సా - మాటల యుద్ధానికి దిగిన స్టార్ బ్యాటర్, అసలు ఏం జరిగిందంటే?&lt;/strong&gt;" href="https://telugu.abplive.com/sports/cricket/virat-kohli-got-involved-in-a-heated-exchange-with-the-media-at-melbourne-airport-191092" target="_blank" rel="nofollow noopener"><strong>Kohli Vs Media: ఆసీస్ మీడియాపై కోహ్లీ గుస్సా - మాటల యుద్ధానికి దిగిన స్టార్ బ్యాటర్, అసలు ఏం జరిగిందంటే?</strong></a></p> <p><strong>2026లో టీ20 ప్రపంచకప్..</strong><br />ఇక 2026లో శ్రీలంకతో కలిసి భారత్ టీ20 ప్రపంచకప్&zwnj;కు ఆతిథ్యమిస్తోంది. ఈక్రమంలో ఈ టోర్నీలో భారత్-పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తటస్థ వేదికపై అంటే లంకలోనో లేక వేరే ఇతర దేశంలో జరిగే అవకాశముంది. ఈ నిర్ణయం 2027 వరకు అమల్లో ఉంటుంది. మరోవైపు 2025 చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. హైబ్రిడ్ మోడల్లో జరిగే ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్&zwnj;లు యూఏఈలో జరుగనున్నాయి. ఒకవేళ భారత్ నాకౌట్&zwnj;కు క్వాలిఫై అయితే సెమీస్, ఫైనల్ మ్యాచ్&zwnj;లు అక్కడే జరుగుతాయి. కాకపోతే పాక్&zwnj;లో జరుగుతాయని ఐసీసీ ప్రకటించింది. ఇక హైబ్రీడ్ మోడల్&zwnj;కు పరిహారంగా 2028 మహిళా టీ20 ప్రపంచకప్ హక్కులను పాక్&zwnj;కు ఐసీసీ కట్టబెట్టింది. ఏదేమైనా ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో సొంతగడ్డపై పాక్&zwnj;తో పోరును చూడలేమని భారత అభిమానులు పేర్కొంటున్నారు. దీంతో ప్రతిష్టాత్మక టోర్నీల్లో సొంతగడ్డ అనుకూలత కూడా మిస్ కానుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.&nbsp;</p> <p><strong>Also Read:</strong> <a title="&lt;strong&gt;Ashwin Retirement Factors: అశ్విన్ రిటైర్మెంట్ వెనుకున్న కారణాలివే.. తన నిర్ణయంతో ఫ్యామిలీ కూడా షాకిచ్చిన స్పిన్ లెజెండ్&lt;/strong&gt;" href="https://telugu.abplive.com/sports/cricket/ravichandran-ashwin-retirement-decision-has-been-to-do-with-two-factors-injury-problems-and-his-future-in-indian-test-team-191081" target="_blank" rel="nofollow noopener"><strong>Ashwin Retirement Factors: అశ్విన్ రిటైర్మెంట్ వెనుకున్న కారణాలివే.. తన నిర్ణయంతో ఫ్యామిలీ కూడా షాకిచ్చిన స్పిన్ లెజెండ్</strong></a></p>
Read Entire Article