<p>Harish Rao met with KCR at the farmhouse: భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో శనివారం ఉదయం పార్టీ కీలక నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కేటీఆర్), మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శంబిపూర్ రాజు, మాజీ మంత్రి టి. హరీశ్ రావు పాల్గొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామాలు, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.<br /> <br />ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ ఉదయం నుంచి ఉండగా, లక్ష్మారెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శంబిపూర్ రాజు వరుసగా కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు కాస్త ఆలస్యంగా ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. తెల్లవారుజామునే ఆయన లండన్ నుంచి హైదరాబాద్ వచ్చారు. కవిత చేసిన ఆరోపణలపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. సంతోష్ రావుతో కలిసి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని మోకిలా వద్ద రూ.750కోట్ల విల్లా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో పోచంపల్లిని కూడా ఫామ్ హౌస్ కు పిలిపించడం ఆసక్తికరంగా మారింది. <br /> <br />అదే సమయంలో కాళేశ్వరం అంశంపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటోంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్ రిపోర్టు పై సీబీఐ విచారణ జరగనుంది. సీబీఐ డైరక్టర్ స్వయంగా హైదరాబాద్ రావడంతో సీరియస్ గా విచారణ జరుగుతుందని అనుకుంటున్నారు. ఇది పూర్తిగా కాళేశ్వరం పై జరుగుతున్న కుట్రగా రజల్లోకి తీసుకెళ్లాలని <a title="కేసీఆర్" href="https://telugu.abplive.com/topic/kcr" data-type="interlinkingkeywords">కేసీఆర్</a> నాయకులకు సూచిస్తున్నారు. బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత సమావేశాలు నిర్వహించి, పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం.</p>
<p>కవిత సొంత పార్టీ పెట్టే అవకాశాలపై కూడా చర్చించారు. కవిత పార్టీ పెడితే అనుసరించాల్సిన వ్యూహాంపైనా ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కోంటోంది. కానీ బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలతో సమస్యలను ఎదుర్కోటోంది. వీటికి ఎక్కువ ప్రాధాన్యత రాకుండా ఉండాలంటే.. కవితను తక్కువగా టార్గెట్ చేసుకుని.. ప్రభుత్వాన్ని ఎక్కువగా విమర్శించాలన్న అభిప్రాయం వినిపించింది. ఈ సమావేశం సుదీర్ఘంగా సాగే అవకాశాలు ఉన్నాయి. </p>
<p> </p>