Growing Potatoes in Air: గాలిలోనే బంగాళదుంపల సాగు; గ్వాలియర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అద్భుతం

2 months ago 6
ARTICLE AD
<p><strong>Aeroponics Potato Farming Gwalior:&nbsp;</strong>భారతీయ వ్యవసాయ రంగంలో మునుపెన్నడూ చూడని అద్భుతమైన ఆవిష్కరణకు మధ్యప్రదేశ్&zwnj; రాష్ట్రంలోని గ్వాలియర్&zwnj; నగరం వేదికైంది. సాధారణంగా బంగాళదుంపలు అంటే భూమి లోపల, మట్టిలో పెరిగే పంట అని అందరికీ తెలుసు. కానీ అద్భుత సాంకేతిక పరిజ్ఞానం ఈ సంప్రదాయాన్ని తిరగరాసింది. గ్వాలియర్&zwnj;లోని రాజమాత విజయరాజే సింధియా అగ్రికల్చర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మట్టితో పని లేకుండా కేవలం గాలిలోనే బంగాళదుంపలను పండించే సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.&nbsp;</p> <h3>ఏరోపోనిక్స్&zwnj; యూనిట్&zwnj;- గాలిలోనే ఆహార ఉత్పత్తి</h3> <p>ఈ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ప్రత్యేక సాంకేతికతను ఏరోపోనిక్స్&zwnj; అని పిలుస్తారు. ఈ విధానంలో మొక్కల వేర్లు నేలలో ఉండవు. దానికి బదులుగా ఒక ప్రత్యేకమైన ఏరోపోనిక్స్ యూనిట్&zwnj;గా వేలాడుతూ ఉంటాయి. మొక్కకు కావాల్సిన పోషకాలను, నీటిని తుంపరల రూపంలో నేరుగా ఆ వేర్లకు అందిస్తారు. దీని వల్ల మొక్కలు మట్టిలో కంటే వేగంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. గ్వాలియర్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ఏరోపోనిక్స్&zwnj;యూనిట్&zwnj; ద్వారా బంగాళదుంపల సాగులో అనూహ్య ఫలితాలు సాధించారు.&nbsp;</p> <blockquote class="twitter-tweet" data-media-max-width="560"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Gwalior, Madhya Pradesh: Rajmata Vijayaraje Scindia Agriculture University has developed a technique to grow potatoes in the air using an aeroponics unit. (05.02) <a href="https://t.co/50dTf9DSa2">pic.twitter.com/50dTf9DSa2</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/2019599698701742254?ref_src=twsrc%5Etfw">February 6, 2026</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <h3>ఈ సాంకేతికత ఎందుకు ప్రత్యేకం</h3> <p>వ్యవసాయ భూమి తగ్గిపోతున్న ప్రస్తుతం తరుణంలో ఈ గాలిలో సాగు పద్ధతి వరప్రసాదంలా మారనుంది. దీని వల్ల మట్టి లేని ప్రాంతాల్లో, సాగుకు పనికిరాని భూములున్న ప్రాంతాల్లో ఈ పద్ధతిలో పంటలు పండించవచ్చు. మట్టి ద్వారా వచ్చే శిలీంద్రాలు, ఇతర వ్యాధుల ముప్పు ఈ విధానంలో ఉండదు. దీని వల్ల అత్యంత నాణ్యమైన రోగనిరోధక శక్తి కలిగిన బంగాళదుంప విత్తనాలను ఉత్పత్తి చేయవచ్చు. సంప్రదాయ సాగుతో పోలిస్తే ఏరోపోనిక్స్&zwnj; విధానంలో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి సాధించే ఛాన్స్ ఉంది. 90 శాతం వరకు నీటిని కూడా ఆదా చేయవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.&nbsp;</p>
Read Entire Article