Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు

11 months ago 7
ARTICLE AD
<p><strong>Group 2 Candidates Miss Their Exam Due To One Minute Rule:&nbsp;</strong>తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. తొలి రోజు ఉదయం నుంచే పరీక్షా కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. అయితే, నిమిషం నిబంధన కొందరు అభ్యర్థుల కొంప ముంచింది. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. కొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు పరీక్షలకు అనుమతించలేదు. దీంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. ముందే స్పష్టమైన ఆదేశాలిచ్చామని.. తామేం చేయలేమని అధికారులు తేల్చిచెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad District) ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో 16 మంది అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. అటు, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పీటీజీ గర్ల్స్ హాస్టల్&zwnj;లో గ్రూప్ 2 పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థిని నిమిషం ఆలస్యం కావడంతో సిబ్బంది అనుమతించలేదు. దీంతో ముగ్గురు అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. అలాగే, మంచిర్యాల జిల్లాలో శ్రీహర్ష డిగ్రీ కాలేజీ పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినందుకు ముగ్గురు అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదు.</p> <p><strong>అరగంట ముందే ఆలస్యమైనా..</strong></p> <p>మరోవైపు, జనగామ జిల్లాలో ఓ మహిళ అరగంట ముందే పరీక్షకు హాజరైనా పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయింది. ఓఎంఆర్ షీట్ బయోమెట్రిక్ సమయంలో అభ్యర్థి సెంటర్ మారిందని గుర్తించిన అధికారులు.. పరీక్ష కేంద్రంలోకి అనుమతించినప్పుడు సెంటర్ కోడ్ ఇది కాదని చెప్పడంతో ఆమె అసలు కేంద్రానికి పరుగున వెళ్లారు. అయితే, అప్పటికే టైం దాటిపోవడంతో వారు అక్కడ అనుమతించలేదు. దీంతో ఆమె చేసేదేమీ లేక కన్నీటి పర్యంతమయ్యారు.</p> <p><strong>Also Read: <a title="Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!" href="https://telugu.abplive.com/andhra-pradesh/south-central-railway-special-trains-to-sabarimala-190587" target="_blank" rel="noopener">Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!</a></strong></p> <p>&nbsp;</p>
Read Entire Article