<p data-path-to-node="0">న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ దాయాది పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది. ఆపరేషన్‌లో భాగంగా భారత సైన్యం పీఓకే, పాక్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అప్పటి నుండి భారత్ తన ఆయుధ శక్తిని పెంచుకుంటూ మరోవైపు మేకిన్ ఇండియా చర్యలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో మరో ముఖ్యమైన విషయం ప్రచారం జరుగుతోంది. భారత్ త్వరలోనే ఇజ్రాయెల్ నుండి గోల్డెన్ హారిజన్ (Golden Horizon) ALBM మిస్సైల్ పొందే అవకాశం ఉంది. ఇది ఆకాశం (గగనతలం) నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి (Air-Launched Ballistic Missile). ఈ మిస్సైల్ ప్రయోగిస్తే క్షణాల్లో టార్గెట్‌ను విధ్వంసం చేస్తుంది. భారత్‌లో బటన్ నొక్కితే క్షణాల్లో ఇస్లామాబాద్ బూడిద అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దాంతో పాక్‌లో వణుకు తప్పదు.</p>
<p data-path-to-node="2">'ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్' నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ భారత్‌కు గోల్డెన్ హారిజన్ ALBMను ఆఫర్ చేసింది. శత్రువుల స్థావరాలపై పూర్తి స్థాయిలో దాడి చేయడంలో ఈ క్షిపణి విజయవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. దీని Range, వేగం బ్రహ్మోస్ కంటే ఒక అడుగు ముందే ఉన్నాయి. ఒకవేళ భారత సైన్యం ఈ క్షిపణిని పొందితే కనుక, సమీపంలోని శత్రు దేశంలోని ఏ నగరాన్నైనా క్షణాల్లో నాశనం చేయవచ్చు.</p>
<p data-path-to-node="3"><strong data-path-to-node="3" data-index-in-node="0">గోల్డెన్ హారిజన్ క్షిపణి ప్రత్యేకతలు ఏమిటి?</strong></p>
<p data-path-to-node="3">ఈ గోల్డెన్ హారిజన్ మిస్సైల్ 1500 నుండి 2000 కిలోమీటర్ల రేంజ్‌లో సేవలు అందిస్తుంది. దీనిని భారత వైమానిక దళానికి చెందిన Su-30MKI యుద్ధ విమానాలపై మోహరించవచ్చు. సుఖోయ్‌తో పాటు మిరాజ్ యుద్ధ విమానాలపై కూడా దీనిని ఏర్పాటు చేయవచ్చని నివేదిక పేర్కొంది. ఈ క్షిపణి సూపర్‌సోనిక్ వేగంతో ప్రయోగించవచ్చు. శత్రువుల రాడార్లకు చిక్కకుండా క్షణాల్లో లక్ష్యాన్ని చేరుకుని విధ్వంసం చేస్తుంది. ఇందులో అణు వార్‌హెడ్‌లను కూడా అమర్చవచ్చని, దాంతో ఈ మిస్సైల్ మరింత ప్రమాదకరంగా మారుస్తుందని చెబుతారు.</p>
<p data-path-to-node="4"><strong data-path-to-node="4" data-index-in-node="0">ఇక్కడ బటన్ నొక్కితే, అక్కడ ఇస్లామాబాద్ బూడిద</strong></p>
<p data-path-to-node="4">ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు పలు నగరాల్లో దాడులు చేసి పాక్ సైన్యానికి కూడా గట్టిగా బుద్ధి చెప్పింది. ఒకవేళ భారత్ కనుక ఇజ్రాయెల్ నుంచి ఈ పవర్‌ఫుల్ మిస్సైల్ పొందిన తర్వాత పాకిస్థాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధం కనుక వస్తే, ఇండియన్ ఆర్మీకి ఈ క్షిపణిని ప్రయోగించే అవకాశం ఉంది. ఈ మిస్సైల్ ప్రయోగిస్తే క్షణాల్లో ఇస్లామాబాద్, కరాచీ వరకు చేరుకుని టార్గెట్స్‌ను నామరూపాలు లేకుండా చేసే సత్తా దీని సొంతం. </p>