<p>Hyderabad News | హైదరాబాద్‌: గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కలకలం రేపిన గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో గులియన్‌ బారే సిండ్రోమ్‌ (Guillain Barre Syndrome) కేసు నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన మహిళకు జీబీఎస్‌ పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ మహిళా పేషెంట్ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స చేస్తున్నట్లు సమాచారం. పొరుగురాష్ట్రం మహారాష్ట్రలో ఇదివరకే దాదాపు 120 మేర గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదు కావడం తెలిసిందే. ఈ జీబీఎస్ పాజిటివ్ గా తేలిన ముగ్గురు వ్యక్తులు పశ్చిమ బెంగాల్ లో ఇటీవల చనిపోవడంతో వైద్య నిపుణులు అలర్ట్ అయ్యారు.</p>