Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం

3 months ago 9
ARTICLE AD
<p><strong>Durgam cheruvu Lake Cable Bridge Problems: &nbsp;</strong>హైదరాబాద్&zwnj;కే తలమానికంగా, పర్యాటక రంగంలో ఒక ఐకానిక్ చిహ్నంగా నిలిచిన &nbsp;దుర్గం చెరువు తీగల వంతెన (Cable Bridge) &nbsp;ప్రస్తుతం నిర్వహణ లేక వెలవెలబోతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ వంతెన, దేశంలోనే అతిపెద్ద ఎక్స్&zwnj;ట్రా డోస్డ్ వంతెనగా గుర్తింపు పొందింది. ప్రారంభంలో పర్యాటకులను మంత్రముగ్ధులను చేసిన ఇక్కడి వైభవం, ఇప్పుడు పాలకుల, అధికారుల నిర్లక్ష్యం కారణంగా మసకబారుతోంది.</p> <p><strong>వెలవెలబోతున్న విద్యుత్ వెలుగులు&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</strong></p> <p>ఈ వంతెన ప్రత్యేకతే దాని అద్భుతమైన కలర్ లైటింగ్. రాత్రి వేళల్లో ఆ వెలుగులు పర్యాటకులకు కనువిందు చేసేవి. కానీ, గత కొంతకాలంగా నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేయడంతో లైటింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వంతెనపై ఉన్న ఎల్&zwnj;ఈడీ దీపాలు పూర్తిగా వెలగడం మానేశాయి. రెండు నెలల కిందట వరకూ సగం సగం అయినా వెలిగేవి.తర్వాత అవి కూడా &nbsp;వెలగడం లేదు. పాడైపోయినా రిపేర్ చేసే దిక్కు లేదు. దీంతో రాత్రి సమయంలో ఒకప్పుడు ధగధగలాడిన ఆ ప్రాంతం ఇప్పుడు చీకటి నీడలను కప్పుకుంటోంది. నిర్వహణ లోపం వల్ల ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది.<br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/01/02/50ff2166f35f4eb995def8210167bbce1767364615144228_original.jpg" /></p> <p><strong>గుర్రపు డెక్కతో నిండిన చెరువు&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</strong></p> <p>వంతెన పైన పరిస్థితి ఇలా ఉంటే, కింద దుర్గం చెరువు పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన ఈ చెరువు, ఇప్పుడు గుర్రపు డెక్క తో నిండిపోయింది. చెరువు ఉపరితలం మొత్తం పచ్చని నాచు, గుర్రపు డెక్క పరుచుకోవడంతో &nbsp;చెరువులో ఓ వైపు నీరు కనిపించని పరిస్థితి నెలకొంది. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ తగ్గి దుర్వాసన రావడంతో పాటు, చెరువు పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటోంది. గతంలో ఎప్పటికప్పుడు ఈ గుర్రపు డెక్కను తొలగించే పనులు జరిగేవి, కానీ ఇప్పుడు ఆ దిశగా చర్యలు శూన్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి.&nbsp; <br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/01/02/c5a77d8e642c904d6cf88a7c5b2ac18e1767364597386228_original.jpg" /></p> <p><strong>నిరాసక్తంగా బోటింగ్ , &nbsp;పర్యాటకం&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</strong></p> <p>పర్యాటకులను ఆకర్షించే ప్రధాన అంశమైన బూటింగ్ ఇప్పుడు అత్యంత నిరాసక్తంగా మారింది. &nbsp;పరిసరాల్లో పెరిగిన చెత్తాచెదారం, నిర్వహణ లేని పార్కులు పర్యాటకులకు ఇబ్బందిగా మారుతున్నాయి. గతంలో వీకెండ్ వచ్చిందంటే వేల సంఖ్యలో సందర్శకులతో కిక్కిరిసిపోయే దుర్గం చెరువు, నేడు అధికారుల ఉదాసీనత వల్ల &nbsp;పర్యాటకులు తగ్గిపోతున్నారు. చెరువు కబ్జాలకు గురవుతోంది. ఐదెకరలను హైడ్రా కబ్జాల నుంచి విముక్తి చేసింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్&zwnj;ను పెంచే ఇలాంటి పర్యాటక ప్రాంతాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తక్షణమే గుర్రపు డెక్కను తొలగించి, వంతెన లైటింగ్ వ్యవస్థను పునరుద్ధరించాలని నగరవాసులు కోరుతున్నారు.<br /><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/01/02/c41ed3c092ea886ac55d0ff94ac311d61767364632804228_original.jpg" /></p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/business/how-to-convert-cryptocurrency-into-our-rupees-232954" width="631" height="381" scrolling="no"></iframe></p>
Read Entire Article