Drishyam style murder: భర్తను చంపేసి కిచెన్‌లో పాతిపెట్టేసింది - చివరికి ఎలా కనిపెట్టారంటే ?

4 weeks ago 2
ARTICLE AD
<p><strong>Drishyam style murder in Ahmedabad:</strong> హత్య చేసి ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టే కథనంతో వచ్చిన 'దృశ్యం' సినిమాలోని కథ తరహాలోనే ఓ &nbsp;హత్య అహ్మదాబాద్ లో జరిగింది. &nbsp;భర్తను చంపి, శవాన్ని కిచెన్ &nbsp;లో పూడ్చి పెట్టిందోభార్య. &nbsp;గుజరాత్&zwnj;లోని అహ్మదాబాద్&zwnj;లోని మెగానీ ప్రాంతంలో &nbsp;ఈ హత్య ఘటన జరిగింది.&nbsp; &nbsp; &nbsp;</p> <p><strong>మద్యానికి బానిసై హింసిస్తున్నాడని&nbsp; భర్త&nbsp; హత్య&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</strong></p> <p>32 ఏళ్ల మహిళ .. &nbsp; 35 ఏళ్ల భర్త రాజ్ పటేల్&zwnj;ను అక్టోబర్ 25న చంపి, శవాన్ని కిచెన్&zwnj;ను తవ్వేసి.. అక్కడే పాతి పెట్టింది. &nbsp;రాజ్ దంపతుల మధ్య కొంత కాలంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రాజ్ చెడు అలవాట్లకు బానిసగా మారడం ఆస్తులన్నీ తగలేస్తున్నాడన్న కారణంతో భార్య ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది. &nbsp;రాజ్, ఒక ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్&zwnj;గా పనిచేసేవాడు, తన ఆదాయాన్ని మద్యానికి ఖర్చు చేసేవాడని భార్య ఆరోపిస్తోంది. అక్టోబర్ 25 రాత్రి, ఇద్దరూ తీవ్రంగా వాదించుకున్నారు. ఆవేశనంలో &nbsp;కృష్ణా భర్తను గొడ్డలితో నరికి చంపేసిందది. "అతను నన్ను కొట్టడానికి ప్రయత్నించాడు, స్వరక్షణ కోసం చేశాను" అని ఆమె పోలీసులకు చెప్పుకొచ్చింది.&nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p><strong>కిచెన్ లో టైల్స్ తీసి&nbsp; గొయ్యి తవ్వి పాతి పెట్టిన మహిళ&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</strong></p> <p>హత్య తర్వాత ఆమె శవాన్ని మాయం చేయాలనుకుంది. బయటకు తీసుకెళ్లలేదు కాబట్టి.. దృశ్యం సినిమాను గుర్తు చేసుకుంది. ఆమె మొదట శవాన్ని ముక్కలుగా కట్ చేసి తలా ఓ చోట పడేయాలనుకుంది.కానీ భయంతో ఆ పని చేయలేకపోయింది. తర్వాత కిచెన్ లోనే పాతి పెట్టాలని నిర్ణయించింది. కిచెన్&zwnj;లోని ఫ్లోరింగ్ టైల్స్&zwnj;ను తొలగించి అక్కడ తవ్వింది. శవాన్ని మట్టిలో దాచి, మళ్లీ టైల్స్&zwnj;ను &nbsp;పెట్టేసింది. దీనికి ఆమె స్నేహితురాలు లక్ష్మీ (30) సహాయం చేసింది. ఇద్దరూ కలిసి శవాన్ని కవర్ చేసి, ఫ్యామిలీకి "రాజ్ ఊరు వద్దకు వెళ్లాడు" అని చెప్పారు.&nbsp;&nbsp;</p> <p><strong>పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే సమయంలో తడబాటు - దొరికిపోయిన మహిళ&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</strong></p> <p>రాజ్ మిస్సింగ్ కేసు నమోదైన అక్టోబర్ 28నుంచి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మొదట్లో భార్య "అతను అప్పుల పాలై పారిపోయాడు" అని చెప్పింది. కానీ సందేహాస్పదంగా ఉండటంతో, పోలీసులు ఇంటి చుట్టూ సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ లొకేషన్&zwnj;లు పరిశీలించారు. రాజ్ ఫోన్ లాస్ట్ సిగ్నల్ ఇంటి సమీపంలోనే ఉండటం గమనించారు. నవంబర్ 4న, కృష్ణా , &nbsp;లక్ష్మీలపై ప్రశ్నిస్తూంటే &nbsp;ఆమె మానసిక ఒత్తిడికి గురై నిజం చెప్పేశారు. &nbsp;పోలీసులు వెంటనే ఇంటిని సెర్చ్ చేసి, కిచెన్ ఫ్లోరింగ్&zwnj;ను &nbsp;తొలగించి చూశారు. . అక్కడ శవం దొరికింది. &nbsp;ఫోరెన్సిక్ టీమ్ పరీక్షలో, మరణానికి గొడ్డలతో నరకడం &nbsp;కారణమని నిర్ధారణ అయింది. &nbsp;</p> <p>నిందతుల్ని &nbsp;రిమాండ్&zwnj;కు పంపించారు. &nbsp;దంపతులకు ఒక 8 ఏళ్ల చిన్న పిల్లవాడు ఉన్నాడు, అతని కస్టడీ కోసం ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలైంది.&nbsp; &nbsp;&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/health/are-you-drinking-water-from-a-copper-bottle-you-should-definitely-know-these-things-226183" width="631" height="381" scrolling="no"></iframe></p>
Read Entire Article