<p>వాషింగ్టన్ డీసీ: రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పారిస్ ఒప్పందం నుంచి బయటకు రావడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం, దేశంలో వాక్ స్వాంతంత్య్రంపై ఉన్న సెన్సార్ తొలగింపు, కొన్ని రోజులపాటు అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా ఉత్వర్వులు జారీ చేశారు. జో బైడెన్ ప్రభుత్వం జారీ చేసిన దాదాపు 78 నిర్ణయాలను రద్దుచేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. చైనా నుంచి పనామా కాలువను తిరిగి చేజిక్కుంచుకుంటామని స్పష్టం చేశారు. దాంతో చైనాతో వివాదానికి ముగింపు పలికే ప్రసక్తే లేదనే సంకేతాలు వచ్చాయి.</p>
<p>చైనా ఉత్పత్తులపై ప్రస్తుతానికి మినహాయింపు ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్.. మెక్సికో, కెనడాలపై ఉక్కుపాదం మోపారు. ఫిబ్రవరి 1 నుంచి మెక్సికో, కెనడా ఉత్పత్తులపై 25 శాతం పన్నులు విధిస్తూ ట్రంప్ ఉత్వర్వులు జారీ చేశారు. సరిహద్దులో అక్రమ వలసల్ని నివారించకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటానని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు.</p>
<p>గతంలో అమెరికాలో జన్మించే పిల్లలకు దేశ పౌరసత్వం లభించేది. ఈ చట్టాల్లో సవరణ తీసుకొస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. దేశంలోకి తల్లిదండ్రులు అక్రమంగా ప్రవేశిస్తే.. వారికి జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం ఇవ్వకూడదని ప్రకటించారు. ఇప్పటివరకూ దేశంలోకి అక్రమంగా వచ్చిన వారికి పుట్టిన సంతానానికి సైతం పౌరసత్వం లభించేలా ఉన్న అమెరికా చట్టాలలో ట్రంప్ ప్రభుత్వం మార్పులు తీసుకొస్తుంది. </p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Washington, DC: US President Donald Trump signs a 'directive to the Federal Government ordering the restoration of Freedom of Speech and preventing government censorship of free speech going forward'.<br /><br />He also signs a 'directive to the Federal Government ending the… <a href="https://t.co/pOkKADLJcH">pic.twitter.com/pOkKADLJcH</a></p>
— ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1881492103743914348?ref_src=twsrc%5Etfw">January 21, 2025</a></blockquote>
<p>
<script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script>
</p>
<p>అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నిక అనంతరం క్యాపిటల్ లో జరిగిన దాడి కేసులో ఇరుక్కున్న రిపబ్లికన్లకు ఊరట కల్పించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసన ట్రంప్ ఎన్నికల హామీ మేరకు 2021 జనవరి 6 నాటి దాడుల్లో పాల్గొన్న 1500 మందికి క్షమాభిక్ష కల్పిస్తూ, వారిపై పెండింగ్‌లో ఉన్న కేసులు కొట్టివేయాలని అటార్నీ జర్నల్‌ను ఆదేశించారు. </p>
<p> </p>