Delhi Blast Latest News: ఢిల్లీలో పేలుడు ఘటనలో నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీక్రెట్‌గా విచారణ

3 weeks ago 2
ARTICLE AD
<p style="text-align: justify;">ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం (నవంబర్ 10)న జరిగిన పేలుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద కారులో పేలుడు సంభవించిన ఘటనలో పది మంది చనిపోయారు. దాంతో ఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. భద్రతా సంస్థలు పూర్తిగా అప్రమత్తమై తనిఖీలు చేపట్టాయి. సోమవారం రాత్రి నుంచే ఢిల్లీ పోలీసులు, స్పెషల్ సెల్, ఎన్ఎస్జీ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. పేలుడు గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు పహర్&zwnj;గంజ్, దరియగంజ్, కన్నాట్ ప్లేస్, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.</p> <p style="text-align: justify;">&nbsp;ఆ ప్రాంతంలోని దాదాపు అన్ని చిన్న, పెద్ద హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్&zwnj;లలో పోలీసు బృందాలు సోదాలు నిర్వహించాయి. పేలుడుకు ముందు గత 48 గంటల్లో గదులను బుక్ చేసుకున్న వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి ప్రతి హోటల్ రిజిస్టర్&zwnj;ను పరిశీలించారు. ఏదైనా అనుమానాస్పద కదలికలను గుర్తించడానికి CCTV ఫుటేజ్&zwnj;లను కూడా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ నలుగురిని అదుపులోకి తీసుకుని రహస్యంగా ప్రశ్నిస్తున్నారు. అయితే, పోలీసులు ఇంకా వారి గుర్తింపు లేదా అరెస్టును అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.</p>
Read Entire Article