Davos Tour: దావోస్‌లో ఘనంగా గ్రాండ్‌ ఇండియా పెవిలియన్ ప్రారంభం.. హాజరైన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి

10 months ago 8
ARTICLE AD
<div><strong>Grand India Pavilion:</strong> దావోస్&zwnj;లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో భారత్&zwnj; పతాకం రెపరెపలాడింది. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్(Grand Indian Pavilion)&nbsp; ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు జయంత్ చౌధరి, చిరాగ్ పాస్వాన్&zwnj;తోపాటు&nbsp; తెలంగాణ సీఎం రేవంత్&zwnj;రెడ్డి(Revanth Reddy) మంత్రి శ్రీధర్&zwnj;బాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.భారత్&zwnj;లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు,రాయితీలు, మానవ వనరులు,మౌలిక వసతులు సహా అన్ని వివరాలను ఇక్కడ తెలపనున్నారు. ఆసక్తి కలిగిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పెవిలియన్ పనిచేయనుంది.</div> <div>&nbsp;</div> <div>పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు&nbsp; చంద్రబాబు(Chandra Babu), రేవంత్&zwnj;రెడ్డి దావోస్&zwnj; పయనమయ్యారు. జ్యూరిక్(Zurich) విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్&zwnj;రెడ్డికి తెలంగాణ ప్రవాసులు ఘనంగా స్వాగతం పలికారు. అప్పుడు అక్కడికి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు బృందాన్ని రేవంత్&zwnj;రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. విమానాశ్రయం&nbsp; వీఐపీ లాంజ్&zwnj;లో చంద్రబాబుతో రేవంత్&zwnj;రెడ్డి(Revanth Reddy) ముచ్చటించారు. ఇరురాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించుకున్నారు. అనంతరం సీఎం రెవంత్&zwnj;రెడ్డి బృందం జ్యూరిక్&zwnj; నుంచి దావోస్&zwnj;(Davos)కు రైలులో వెళ్లారు. దావోస్&zwnj;లో నేడు,రేపు,ఎల్లుండి జరిగే సదస్సులో ముఖ్యమంత్రి బృందం పాల్గొననుంది. పెట్టుబడులు సాధనే లక్ష్యంగా 15 ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో&nbsp; భారీ పెట్టుబడుల లక్ష్యంగా దాదాపు 15 ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు.</div> <div>&nbsp;</div> <div>అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జ్యూరిక్ విమానాశ్రయంలో ప్రవాసాంధ్రులు ఘనంగా స్వాగతం పలికారు.అక్కడే పారిశ్రామికవేత్తలతో సమావేశమైన చంద్రబాబు(Chandra Babu) బృందం...ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. ముఖ్యంగా మాన్యుపాక్చరింగ్, ఆర్&zwnj; అండ్&zwnj; డి రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించింది. విశాలమైన సముద్రతీరం, పోర్టులు, విమాశ్రయాలు, రైలు,రోడ్డు కనెక్టివ్&zwnj; గురించి వారికి వివరించింది.పెట్టుబడిదారులకు ఏపీ ఇస్తున్నన్ని రాయితీలో భారత్&zwnj;లో ఏ రాష్ట్రంలోనూ&nbsp; ఇవ్వడం లేదని చంద్రబాబు వివరించారు.&nbsp; అలాగే సింగిల్ విండో విధానంలో&nbsp; కేవలం 15 రోజుల్లోనే అనుమతులన్నీ ఇస్తామన్నారు.</div> <div>కొత్తగా రానున్న పోర్టులు,విమానాశ్రయాల గురించి వివరించి పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ఆ తర్వాత స్విస్&zwnj;లోని భారత్&zwnj; రాయబారి మృదుల్&zwnj;కుమార్&zwnj;తోనూ&nbsp; చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. స్విస్&zwnj;లో అతిపెద్ద వ్యాపార రంగంగా వెలుగొందుతున్న ఫార్మాలో ప్రపంచస్థాయి సంస్థలు ఉన్నాయని....వారందరూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సహకరించాలని కోరారు. అలాగే ఏపీని వర్క్&zwnj;ఫ్రం హోం హబ్&zwnj;గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్న సీఎం...ఆ దేశగా ఇక్కడి కంపెనీలతో చర్చలు జరపాలని కోరారు. ఆ తర్వాత తెలుగు పారిశ్రామికవేత్తలతోనూ&nbsp; చంద్రబాబు బృందం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. మాతృభూమి రుణం తీర్చుకునేందుకు మీరంతా సహకరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.అనంతరం అక్కడి నుంచి దావోస్&zwnj;కు బయలుదేరి వెళ్లారు.</div> <div>&nbsp;</div> <div><strong>తెలుగురాష్ట్రాల భవిష్యత్&zwnj;పై చర్చించాం</strong></div> <div>జ్యూరిక్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్&zwnj;రెడ్డి ఎక్స్&zwnj;వేదికగా స్పందించారు. యాధృచ్చికంగా కలిసి స్వల్ప సమయమే మాట్లాడుకున్నా చర్చ చాలా గౌరవప్రదంగా జరిగిందని రేవంత్&zwnj;రెడ్డి అన్నారు.తెలుగురాష్ట్రాల భవిష్యత్&zwnj; గురించే ఈ సమావేశంలో చర్చించామని ఆయన ట్వీట్ చేశారు.&nbsp;రాష్ట్రాలు వేరైనా తెలుగుజాతి ఒకటేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుజాతి అంతర్జాతీయంగా&nbsp; వెలుగొందాలని ఆయన అన్నారు. జ్యూరిక్&zwnj;లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్&zwnj;రెడ్డిని కలవడం ఆనందగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. రేవంత్&zwnj;రెడ్డి ట్వీట్&zwnj;కు ప్రతిస్పందనగా&nbsp; <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> రీట్వీట్&zwnj; చేశారు</div> <p>&nbsp;</p>
Read Entire Article