Cyber Attack On Pensions: సైబర్ నేరగాళ్ల ఫోకస్‌ మీ పెన్షన్‌పై పడింది - ఒక్క క్లిక్‌తో మీ డబ్బంతా పోతుంది, జాగ్రత్త!

9 months ago 8
ARTICLE AD
<p><strong>Online Fraud In Pensions:</strong> ఉద్యోగులకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు ఆదుకునే మార్గాల్లో ఒకటి పెన్షన్ ఫండ్ లేదా పీఎఫ్ ఫండ్. మీ పని పూర్తయ్యేందుకు &amp; మీరు మరెక్కడా డబ్బు అడగాల్సిన అవసరం లేకుండా ఇది సహకరిస్తుంది. చాలా మంది, ఎక్కువ మొత్తంలో డబ్బు కావలసినప్పుడు రుణం తీసుకోకుండా పీఎఫ్&zwnj; ఖాతా నుంచి వీలైనంత ఎక్కువ డబ్బును విత్&zwnj;డ్రా చేస్తుంటారు. ఇలాంటి అవసరంలో ఉన్న వ్యక్తులను కొన్ని వెబ్&zwnj;సైట్&zwnj;లు, ఇ-మెయిల్ లేదా SMSలు ఆకర్షిస్తాయి.</p> <p><strong>PFRDA హెచ్చరిక</strong><br />మీ పెన్షన్ ఫండ్ నుంచి మొత్తం డబ్బును ఉపసంహరించుకోవడంలో మీకు సాయం చేస్తామని ఇ-మెయిల్ లేదా SMSలు వస్తుంటాయి. నిజానికి అవి "మోసపూరిత ప్రకటనలు". అలాంటి ప్రకటనల మాయలో పడవద్దని 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్&zwnj; డెవలప్&zwnj;మెంట్ అథారిటీ' &zwj;(Pension Fund Regulatory and Development Authority - PFRDA) హెచ్చరించింది. దీనిపై ప్రజలను హెచ్చరిస్తూ ఒక పబ్లిక్ నోటీసును కూడా జారీ చేసింది. "పెన్షన్&zwnj; ఫండ్&zwnj; డబ్బును పాక్షికంగా కాకుండా పూర్తిగా ఉపసంహరించుకోవచ్చని, అందుకు సాయం చేస్తామని చెప్పేవాళ్లు సైబర్ మోసగాళ్ళు కావచ్చు. పెన్షన్ నిధులను ఉపసంహరించుకునేందుకు మీకు సాయం చేసే పేరుతో మీ జీవితకాల పొదుపును దోచుకుంటారు" అని PFRDA హెచ్చరించింది.&nbsp;</p> <p>నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి పథకాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 100% పెన్షన్ ఫండ్ మొత్తాన్ని ఉపసంహరించుకోలేరని PFRDA స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం, కొంత భాగాన్ని (పాక్షికంగా) మాత్రమే ఉపసంహరించుకోవచ్చని వెల్లడించింది.</p> <p><strong>సైబర్ దుండగులు పెన్షన్లను దొంగిలించే విధానం ఇదీ...&nbsp;</strong><br />పెండింగ్&zwnj;లో ఉన్న పెన్షన్ విడుదల పేరుతో, లైఫ్ సర్టిఫికెట్ అప్&zwnj;డేట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు ఎప్పటికప్పుడు ఇలాంటి దుశ్చర్యల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. అయినప్పటికీ సైబర్ మోసాలకు అడ్డకట్ట మాత్రం పడడం లేదు. పెన్షనర్ల జీవిత ధృవీకరణ పత్రాన్ని ఆన్&zwnj;లైన్&zwnj;లో అప్&zwnj;డేట్&zwnj; చేసేందుకు సాయం చేసే నెపంతో సైబర్ మోసగాళ్ళు ఫోన్&zwnj; కాల్స్&zwnj; చేస్తున్నారని, వారి వలలో పడినవారిని మోసం చేసి పెన్షన్&zwnj; డబ్బు దోచుకుంటున్నారని హెచ్చరిస్తూ 'సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్' (CPAO) కూడా తన వెబ్&zwnj;సైట్&zwnj;లో స్పష్టంగా పేర్కొంది, &nbsp;</p> <p><strong>OTP ద్వారా పెన్షన్ ఖాతాలకు యాక్సెస్</strong><br />ఫోన్&zwnj; చేస్తున్న ఆన్&zwnj;లైన్&zwnj; నేరగాళ్లు, పింఛనుదార్ల పెన్షన్ పేమెంట్&zwnj; ఆర్డర్ (PPO) నంబర్, పుట్టిన తేదీ, బ్యాంక్ వివరాలు, ఆధార్ నంబర్ మొదలైన వ్యక్తిగత వివరాలను అడుగుతారు. ఆ తర్వాత, ధృవీకరణ కోసం, పింఛనుదారు మొబైల్&zwnj; నంబర్&zwnj;కు వచ్చే వన్ టైమ్ పాస్&zwnj;వర్డ్&zwnj;ను (OTP) తమకు చెప్పని సూచిస్తారు. OTPని అనుమానిత వ్యక్తులకు చెబితే, పెన్షన్ ఖాతా యాక్సెస్ మోసగాడి చేతిలోకి వెళ్తుంది. ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం స్వాహా అవుతుంది. బాధితులు తమ డబ్బును తిరిగి పొందడం కూడా కష్టంగా మారుతుంది.</p> <p>ఒకవేళ, ఏ వ్యక్తి అయినా సైబర్&zwnj; నేరం వల్ల డబ్బు కోల్పోతే, మొదటి గంట సమయం లోపలే బ్యాంక్&zwnj; అధికార్లకు విషయం చెప్పాలి. దీనిని "గోల్డెన్&zwnj; అవర్&zwnj;" అంటారు. దీనివల్ల, పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశాలు మెరుగుపడతాయి.</p> <p>మరో ఆసక్తికర కథనం: <a title="భారత్&zwnj;లో ఉద్యోగాలకు 'టెస్లా' ప్రకటన - మోదీ చేసిన 'మ్యాజిక్&zwnj;' ఇది" href="https://telugu.abplive.com/business/tesla-has-advertised-for-13-jobs-in-india-the-job-announcement-comes-after-elon-musk-met-with-modi-198240" target="_self">భారత్&zwnj;లో ఉద్యోగాలకు 'టెస్లా' ప్రకటన - మోదీ చేసిన 'మ్యాజిక్&zwnj;' ఇది</a>&nbsp;</p>
Read Entire Article