Crime News: డ్రోన్ తో గాలించి గంజాయి పట్టుకున్న ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు

1 month ago 2
ARTICLE AD
<p><br />కెరిమెరి: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండల పరిధిలో గంజాయి సాగు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో ఆసిఫాబాద్ ఎఎస్పీ చిత్తరంజన్ డ్రోన్ సహాయంతో పంట భూములపై పర్యవేక్షణ నిర్వహించారు. డ్రోన్ సర్వే ద్వారా గంజాయి మొక్కలు సాగు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, సంబంధిత మండల పోలీస్ అధికారులు, ఎక్సైజ్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుని వెంటనే నిర్మూలన చర్యలు తీసుకుంటామని తెలిపారు.&nbsp;</p> <p>ఈ క్రమంలో కెరిమెరి మండలంలోని నారాయణగూడా గ్రామం, అంతపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని రాథోడ్ బాలాజీ అనే వ్యక్తి&nbsp; వ్యవసాయ పొలంలో పత్తి, కంది పంటల మధ్యలో అంతరపంటగా గంజాయి సాగు చేశాడు. గాలింపు చర్యల్లో భాగంగా మొత్తం 51 గంజాయి మొక్కలు గుర్తించారు. ఆ మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.</p> <p><strong>యువత భవిష్యత్తును నాశనం నాశనం చేసే గంజాయి</strong></p> <p>ఈ సందర్భంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏఎస్పీ చిత్తరంజన్ మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణా, అమ్మకం, వినియోగం చట్టపరంగా తీవ్ర నేరం అని, ఈ అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయనీ, గత జూన్ 2025 నుండి ఇప్పటికి &nbsp;ఆసిఫాబాద్ సబ్ డివిజన్ లో 51 కేసులు కాగా, 560 మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు స్వయంగా ఈ నేరాలకు దూరంగా ఉండి, గంజాయి సాగు జరుగుతున్న సమాచారాన్ని వెంటనే డయల్ 100 లేదా 8712670551 నంబర్&zwnj;కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి మరియు తగిన పారితోషికం అందించబడుతుందని ఆసిఫాబాద్ ఏఎస్&zwnj;పీ చిత్తరంజన్ పేర్కొన్నారు.&nbsp;</p> <p>గంజాయి రవాణా, సరఫరా, అమ్మకం లేదా మొక్కల పెంపకం జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా అణచివేయడమే లక్ష్యంగా పోలీసులు నిరంతర పర్యవేక్షణ చర్యలను కొనసాగిస్తున్నట్లు ఏఎస్&zwnj;పీ తెలిపారు. గ్రామాల పరిధిలో డ్రోన్ సర్వేలు, స్థానిక పోలీస్ బృందాల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వాంకిడి సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, కెరమెరి ఎస్సై మధుకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.</p> <p>అటూ మరోపక్క ఆసిఫాబాద్ జిల్లాలోనీ లింగాపూర్ మండలంలోను పోలీసులు పలు చోట్ల సోదాలు నిర్వహించి గంజాయి మొక్కలు పట్టుకున్నారు. లింగాపూర్ మండలంలోని ఘుమ్నూర్ (కే) గ్రామ పరిధిలో పత్తి చేనులో గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తిని లింగాపూర్ ఎస్సై గంగన్న అధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. పోలీసు బృందం తనిఖీలు నిర్వహించగా.. అడా లక్ష్మణ్ (30) అనే వ్యక్తి తన పత్తి పొలంలో అక్రమంగా 35 గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని, నిందితుడు అడా లక్ష్మణ్ పై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.&nbsp;</p> <p>గంజాయి సాగు, రవాణా, అమ్మకం పూర్తిగా నేరమని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలలో పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు గంజాయి సాగు లేదా రవాణా జరుగుతున్న విషయం తెలిసిన వెంటనే డయల్ 100 లేదా 8712670551 నంబర్&zwnj;కు సమాచారం అందించాలని ఆయన కోరారు. సమాచారం వివరాలు గోప్యంగా ఉంచబడతాయి మరియు తగిన పారితోషికం కూడా అందజేయబడుతుందని అన్నారు.</p>
Read Entire Article