<p><strong>Woman Abused Vidoe Gone Viral In Assam: </strong>దేశంలో మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, అస్సాంలో (Assam) దారుణం జరిగింది. ఓ యువతిపై గత నెలలో సామూహిక అత్యాచారం జరగ్గా.. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనికి కారణమైన 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం గువాహటీలోని ఓ ఆలయం పరిసరాల్లో నవంబర్ 17న ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన నిందితులు వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇవి వైరల్‌గా మారడంతో యువతిపై అత్యాచారానికి పాల్పడిన 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.</p>
<p>అయితే, బాధితురాలు ఎవరనేది తెలియాల్సి ఉంది. నిందితులు 18 నుంచి 23 ఏళ్ల మధ్య వారేనని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చెయ్యొద్దని పోలీసులు తెలిపారు.</p>
<p><strong>Also Read: <a title="Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో" href="https://telugu.abplive.com/news/world/onlyfans-model-lily-phillips-cries-after-sleep-with-100-men-in-one-day-190320" target="_blank" rel="noopener">Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో</a></strong></p>