CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

3 weeks ago 3
ARTICLE AD
<p>సిద్దిపేట: ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి &nbsp;ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం (మార్చి 22న) సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో పర్యటించారు. అక్కడ రూ. 300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితం చేశారు. దీనితో పాటు రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం రూ. 775.72 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన మంత్రులతో కలిసి శ్రీకారం చుట్టారు.</p> <p><strong>సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..</strong></p> <p>సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలో విద్యా, వైద్య, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ పలు భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో రూ. 141.34 కోట్లతో సిద్ధిపేట మున్సిపాలిటీలో నీటి సరఫరా, డ్రైనేజీ ప్రాజెక్టులు, రూ. 78 కోట్లతో ఎన్సాన్&zwnj;పల్లిలో జిల్లా జైలు భవనం, రూ. 15 కోట్లతో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రి ముఖ్యమైనవి ఉన్నాయి. వీటితో పాటు సెంట్రల్ మెడిసిన్ స్టోర్, నంగునూరు, అంబేద్కర్ నగర్&zwnj;లలో కొత్త పిహెచ్&zwnj;సి (PHC) భవనాలను జాతికి అంకితం చేశారు.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="te">ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఈరోజు సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితం చేయనున్నారు. దీంతో పాటు రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.<br />వీటితో పాటు సిద్ధిపేట&hellip; <a href="https://t.co/WMX8alMDAm">pic.twitter.com/WMX8alMDAm</a></p> &mdash; Telangana CMO (@TelanganaCMO) <a href="https://twitter.com/TelanganaCMO/status/2035583153755312147?ref_src=twsrc%5Etfw">March 22, 2026</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>గజ్వేల్ నియోజకవర్గంలో కూడా భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ముఖ్యంగా కొండపాకలో రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్&zwnj;కు ముఖ్యమంత్రి <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> పునాది రాయి వేశారు. మర్కూక్ మరియు జగదేవ్&zwnj;పూర్ మండలాల్లో నూతనంగా నిర్మించిన సమీకృత మండల కార్యాలయాల సముదాయాలను (IOC) ప్రారంభించడంతో పాటు, మర్కూక్ తెలంగాణ పబ్లిక్ స్కూల్&zwnj;లో అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించారు.</p>
Read Entire Article