Chandrababu AI Summit: ఏఐ రంగంలో ఆంధ్రప్రదేశ్ నవశకం - ఢిల్లీ సమ్మిట్‌లో చంద్రబాబు విజన్

1 month ago 6
ARTICLE AD
<p><strong>Chandrababu Naidu makes key agreements at AI Summit:</strong> ఢిల్లీలో జరుగుతున్న &nbsp;ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు &nbsp;పాల్గొన్నారు. పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. &nbsp;<br />&nbsp; &nbsp;<br /><strong>ఏపీని ఏఐ హబ్&zwnj;గా తీర్చిదిద్దడమే లక్ష్యం&nbsp;</strong></p> <p>ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న &nbsp;ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్&zwnj;ను అంతర్జాతీయ కృత్రిమ మేధ కేంద్రంగా మార్చేందుకు తన ప్రణాళికలను వివరించారు. రాష్ట్రాన్ని సాంకేతిక హబ్&zwnj;గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆయన పలు అంతర్జాతీయ ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా ఏడు కీలక ఒప్పందాలను &nbsp;కుదుర్చుకున్నారు.</p> <p><strong>యువతకు భారీ నైపుణ్యాభివృద్ధి &ndash; ఐబీఎంతో ఒప్పందం&nbsp;</strong></p> <p>ఈ సమ్మిట్&zwnj;లో కుదిరిన అత్యంత కీలకమైన ఒప్పందాల్లో ఐబీఎమ్ సంస్థతో కుదిరిన ఒప్పందం ఒకటి. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్&zwnj;లోని సుమారు &nbsp;10 లక్షల మంది యువతకు &nbsp;ఏఐ, క్వాంటం టెక్నాలజీ, , సైబర్ సెక్యూరిటీ వంటి అత్యాధునిక రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇది రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.</p> <p><strong>విద్య, &nbsp;పరిశోధన రంగాల్లో విప్లవాత్మక మార్పులు&nbsp;</strong></p> <p>విద్యార్థుల కోసం &nbsp;ఏఐ ట్యూటర్ ను రూపొందించేందుకు ఐఐటీ మద్రాస్&zwnj;తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అలాగే, క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్&zwnj;ఐఈఎల్&zwnj;ఐటీ &nbsp;తోనూ, క్వాంటం సెంటర్ ఆఫ్ ఎక్స్&zwnj;లెన్స్ కోసం యూనిసీసీ సంస్థతోనూ ఎంఓయూలు కుదిరాయి. వీటితో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎన్విడియా &nbsp;సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్&zwnj; ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం ప్రకటించారు.</p> <p><strong>&nbsp;వరల్డ్ ఎకనామిక్ ఫోరం రౌండ్ టేబుల్&zwnj;లో ప్రసంగం&nbsp;</strong></p> <p>ఏఐ ద్వారా పోటీతత్వం అనే అంశంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ఏఐ అనేది కేవలం సాంకేతికత మాత్రమే కాదని, అది సామాన్యుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే సాధనమని ఆయన పేర్కొన్నారు. &nbsp;గతంలో కంప్యూటర్ విప్లవాన్ని ఎలాగైతే అందిపుచ్చుకున్నామో, ఇప్పుడు ఏఐ విప్లవంలోనూ ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది &nbsp;అని ఆయన ఉద్ఘాటించారు. పాలనలో పారదర్శకత కోసం ఏఐని ఉపయోగిస్తామని తెలిపారు.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="te">ఢిల్లీలో జరుగుతోన్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ డైరెక్టర్ సమీర్ చౌహాన్&zwnj;తో భేటీ అయ్యారు. అనంతరం UNICCతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.&hellip; <a href="https://t.co/6rzIhuyheO">pic.twitter.com/6rzIhuyheO</a></p> &mdash; Telugu Desam Party (@JaiTDP) <a href="https://twitter.com/JaiTDP/status/2024754084561953208?ref_src=twsrc%5Etfw">February 20, 2026</a></blockquote> <p><strong>పారిశ్రామిక దిగ్గజాలతో కీలక భేటీలు&nbsp;</strong></p> <p>సమ్మిట్ సందర్భంగా <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> అడోబ్ &nbsp;సీఈఓ శాంతనూ నారాయణ్, ఆటోడెస్క్ ప్రతినిధులు , &nbsp;యునైటెడ్ కింగ్&zwnj;డమ్ డెలిగేషన్&zwnj;తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరిస్తూ, అమరావతిని ఏఐ సిటీ గా అభివృద్ధి చేసేందుకు వారి సహకారాన్ని కోరారు.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/amravati/this-government-school-in-amaravati-is-of-international-range-238382" width="631" height="381" scrolling="no"></iframe></p>
Read Entire Article