Cell phone alert: శనివారం మీ మొబైల్‌కు అత్యవసర హెచ్చరికలు.. భయపడాల్సిన పనే లేదు - ఎందుకో తెలుసా?

1 month ago 5
ARTICLE AD
<p><strong>Cell phone danger signal alert:</strong> &nbsp;దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులందరికీ మే 2, 2026న &nbsp;ఒకేసారి అత్యవసర హెచ్చరిక సందేశాలు రానున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్&zwnj;మెంట్ అథారిటీ (NDMA), టెలికాం విభాగం (DoT) సంయుక్తంగా చేపడుతున్న &nbsp;సెల్ బ్రాడ్&zwnj;కాస్ట్ అలర్ట్ సిస్టమ్ &nbsp;పరీక్షలో భాగంగా ఈ సందేశాలను పంపనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఈ వినూత్న వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించనున్నారు. &nbsp; అందుకే &nbsp;ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, ఇది కేవలం సాంకేతిక పరీక్ష మాత్రమేనని ప్రభుత్వం &nbsp;ముందస్తుగా అందరికీ సమాచారం పంపుతోంది.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <p><strong>ఏమిటీ సెల్ బ్రాడ్&zwnj;కాస్ట్ వ్యవస్థ?&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</strong></p> <p>ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సెకన్ల వ్యవధిలో లక్షలాది మందిని అప్రమత్తం చేయడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. సాధారణ ఎస్ఎంఎస్ పంపడానికి నెట్&zwnj;వర్క్ సామర్థ్యం సరిపోకపోయినా, ఈ సెల్ బ్రాడ్&zwnj;కాస్ట్ &nbsp;సాంకేతికత ద్వారా ఒకేసారి ఒక నిర్దిష్ట ప్రాంతంలోని అన్ని ఫోన్లకు సందేశం చేరుతుంది. దీని కోసం వినియోగదారులకు ఇంటర్నెట్ సౌకర్యం ఉండాల్సిన అవసరం లేదు. సెల్ టవర్ల పరిధిలోని ప్రతి హ్యాండ్&zwnj;సెట్&zwnj;కు ఈ హెచ్చరిక నేరుగా వెళ్తుంది.</p> <p><strong>టెస్ట్ అలర్ట్ ఎలా ఉంటుంది?&nbsp;</strong></p> <p>రేపు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఏ క్షణంలోనైనా మీ ఫోన్&zwnj;కు ఈ టెస్ట్ మెసేజ్ రావచ్చు. ఈ సందేశం వచ్చినప్పుడు మీ మొబైల్ ఫోన్ బిగ్గరగా బీప్ శబ్దం చేస్తూ వైబ్రేట్ అవుతుంది. ఫోన్ స్క్రీన్&zwnj;పై &nbsp;NDMA will test Cell Broadcast Alerts... అనే సందేశం కనిపిస్తుంది. ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ఈ హెచ్చరికలు వస్తాయి. ఈ మెసేజ్ చూడగానే మీరు ఎటువంటి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగే ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన పని లేదు.</p> <p><strong>&nbsp;ముందస్తు అప్రమత్తతే లక్ష్యం&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</strong></p> <p>వరదలు, భూకంపాలు, సునామీలు లేదా భారీ తుపాన్ల వంటి విపత్తులు సంభవించే ముందే ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం &nbsp;సాచెట్ &nbsp;అనే ఇంటిగ్రేటెడ్ అలర్ట్ పోర్టల్&zwnj;ను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. గతంలో సుమారు 134 బిలియన్ల ఎస్ఎంఎస్ హెచ్చరికలను ప్రభుత్వం పంపినప్పటికీ, సెల్ బ్రాడ్&zwnj;కాస్ట్ టెక్నాలజీ మరింత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Your phone might buzz&mdash;but there&rsquo;s no need to worry.<br /><br />India is testing its indigenous Cell Broadcast System to enable instant, geo-targeted disaster alerts across the country.<br /><br />You may receive test messages in English, Hindi &amp; regional languages, if test channel is enabled in your&hellip; <a href="https://t.co/NoIJdpJwIk">pic.twitter.com/NoIJdpJwIk</a></p> &mdash; DoT India (@DoT_India) <a href="https://twitter.com/DoT_India/status/2049519308464947229?ref_src=twsrc%5Etfw">April 29, 2026</a></blockquote> <p><strong>&nbsp;ప్రజలకు విజ్ఞప్తి&nbsp;</strong></p> <p>ఈ మొబైల్ హెచ్చరికలు కేవలం వ్యవస్థ పనితీరును సరిచూడటానికేనని, ఎవరూ భయాందోళనలకు గురికావద్దని ఎన్&zwnj;డీఎంఏ కోరింది. ఒకవేళ మీ ఫోన్&zwnj;లో &nbsp;వైర్&zwnj;లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ &nbsp;సెట్టింగ్ ఆన్&zwnj;లో ఉంటేనే ఈ పరీక్షా సందేశాలు అందుతాయి. భవిష్యత్తులో నిజమైన ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ వ్యవస్థ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/news/if-you-make-these-mistakes-you-will-not-get-a-passport-245946" width="631" height="381" scrolling="no"></iframe></p> <p>&nbsp;</p>
Read Entire Article