Cash for Vote Case: చంద్రబాబు, రేవంత్‌ ఇద్దరూ దోషులే.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రద్దు చేయాలి: సీజేఐకి మత్తయ్య లేఖ

2 months ago 3
ARTICLE AD
<p>హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్&zwnj;రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్ర ఉందని నిందితుడు జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్&zwnj; బీఆర్&zwnj; గవాయ్&zwnj;కి బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబుతో సహా ఇతర నేతలపై కేసులు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణను చేపట్టాలని కోరారు. 2016లో చంద్రబాబు, రేవంత్&zwnj;రెడ్డి తనను పిలిపించి ఓటుకు నోటు గురించి వివరించారని, ఓ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో పార్టీకి ఓటు వేసేలా ఒప్పించాలని చెప్పారన్నారు.&nbsp;</p> <p><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/09/24/3b6aa6941df127557431a1d30b81251f1758677343952233_original.jpeg" /></p> <p>అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్&zwnj;సన్&zwnj;కు రూ.5 కోట్లు ఇచ్చి తమకు అనుకూలంగా ఓటు వేసేలా ఒప్పించాలని తనను ప్రోత్సహించి నేరం చేపించారని కీలక విషయాలు వెల్లడించారు. ఓటుకు నోటు కేసులో నిందితుడు మత్తయ్య తన పాత్రను అంగీకరించి, ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తప్పులను ఒప్పుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్&zwnj;, తెలంగాణ ప్రభుత్వాలను రద్దు చేయాలని, ఈ కేసుకు సంబంధించి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తన లేఖలో కోరారు.&nbsp;</p> <p><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/09/24/57bb30bce9171be7e0b0a22681f2c1391758677365704233_original.jpeg" /></p> <p data-start="0" data-end="844">అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఓటుకు నోటు కేసు నమోదు చేసినందుకు ప్రతిగా అప్పటి ఏపీ ప్రభుత్వం ఫోన్&zwnj;ట్యాపింగ్ కేసు పెట్టిందన్నారు. ఈ అంశాన్ని తెలంగాణ తరఫున వాదించిన లాయర్ మేనక గురుస్వామి సుప్రీంకోర్టులో ప్రస్తావించకపోవడం విచారకరం అన్నారు. అందుకే తుది తీర్పు ఇచ్చే ముందు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని మత్తయ్య విజ్ఞప్తి చేశారు.</p> <p data-start="846" data-end="1346">మత్తయ్య తన లేఖలో కీలకంగా మరో విషయాన్ని ప్రస్తావించారు. &ldquo;ఈ కేసులో <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a>, నారా లోకేశ్&zwnj;, <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a> నాయకులు, అప్పటి ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్&zwnj; విభాగం, న్యాయవాదుల పేర్లను సైతం ఎఫ్&zwnj;ఐఆర్&zwnj;లో చేర్చాలి. చట్టప్రకారం కేసులు నమోదు చేయాలి. నన్ను అరెస్టు చేసినట్టుగానే వారినీ అరెస్టు చేసి, నన్ను ప్రేరేపించిన వారి పాత్రను పూర్తిగా విచారించి, కఠినంగా శిక్షించాలి&rdquo;&nbsp;</p> <p data-start="1863" data-end="2132" data-is-last-node="" data-is-only-node="">సుప్రీంకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు, వారి ప్రతినిధులకు, ప్రజాస్వామ్య విలువలకు ఒక స్పష్టమైన సందేశం కావాలని మత్తయ్య విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధుల ఓట్లను డబ్బు, పదవుల ఆశ చూపి కొనుగోలు చేయకుండా, ప్రజల మనోభావాలను కాపాడే దిశగా న్యాయం జరగాలని కోరారు.</p>
Read Entire Article