Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు

3 months ago 8
ARTICLE AD
<p>Chandrababu Naidu Business Reformer of the Year: &nbsp;ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు &nbsp; ప్రతిష్టాత్మక &nbsp;బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ &nbsp;అవార్డు లభించింది. &nbsp; &nbsp;భారతీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని జ్యూరీ ఈ అవార్డును చంద్రబాబుకు ఇవ్వాలని నిర్ణయించింది. &nbsp;రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాలు అమలు చేయడం, పారిశ్రామిక సంస్కరణలు చేపట్టడం, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం వంటి కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.</p> <p>కలెక్టర్ల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు ఈ అవార్డు ప్రకటన గురించి ప్రస్తావించారు. &nbsp;అవార్డును అందుకున్న ముఖ్యమంత్రికి ప్రజలందరి తరపున అభినందనలు తెలిపారు. &nbsp;సీఎం చంద్రబాబుకు ఎకనమిక్ టైమ్స్ అవార్డు ప్రకటించడం దేశం మొత్తం చర్చనీయాంశమైందని పయ్యావుల కేశవ్ తెలిపారు. &nbsp;ఈ రాష్ట్రం గతంలో దాదాగిరిని చూసింది... అభివృద్ధికి దూరమైంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నాయుడుగిరిని చూస్తోంది.. అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. &nbsp;సంస్కరణలు చేపట్టాలంటే చాలా ధైర్యం కావాలి.. సీఎం చంద్రబాబుకు టన్నుల కొద్ది ధైర్యం ఉంది. &nbsp;మొత్తంగా కూటమి పాలనలో 25 కొత్త పాలసీలు తెచ్చారని గుర్తు చేశారు.&nbsp;</p> <p>ప్రతి రోజూ కొత్తరకంగా ఆలోచన చేయాలనే సీఎం చెబుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ జనరేషన్ ముందే ఆలోచిస్తారని పయ్యావుల కేశవ్ అన్నారు. &nbsp;ఆర్థిక సంస్కరణలను అందిపుచ్చుకుంది మొదటి రాష్ట్రం నాడు ఏపీని నిలిపారు. &nbsp;పవర్ సెక్టార్ రిఫామ్స్ తెచ్చింది చంద్రబాబేనన్నారు. &nbsp;దేశంలో అత్యంత ప్రముఖులతో కూడిన జ్యూరీ ఈ అవార్డును ప్రకటించింది. &nbsp;ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న వాళ్లకే ఈ ఆవార్డు ఇచ్చారు... ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి తొలిసారిగా ఇచ్చిందని.. సీఎంతో కలిసి పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని పయ్యావుల అన్నారు&nbsp;<br />&nbsp;<br />ఈ తరహా అవార్డులు ఎప్పుడూ తీసుకోలేదు. విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించానని <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> గుర్తు చేశారు. ఈ అవార్డు రావటం వెనుక క్రెడిట్ అంతా నా సహచరులు, అధికారులు, కలెక్టర్లదేనన్నారు. &nbsp;ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో గతంలో గుజరాత్ మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ప్రతీ ఏడాదీ ఏపీనే అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నిసార్లు నిబంధనలు మార్చినా మనమే నెంబర్ వన్ గా ఉన్నామని తెలిపారు. &nbsp;మనం ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. 18 నెలల్లో 25 పాలసీలను తీసుకువచ్చి పరిశ్రమలను, పెట్టుబడులను తీసుకువస్తున్నాం. &nbsp;ప్రతీ నెలా ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీల ద్వారా పెట్టుబడులకు ఆమోదం తెలియచేశామన్నారు. &nbsp;<a title="పవన్ కల్యాణ్" href="https://telugu.abplive.com/topic/Pawan-Kalyan" data-type="interlinkingkeywords">పవన్ కల్యాణ్</a> పూర్తి సహకారం అందిస్తున్నారు... ఇక కేంద్రం ఇస్తున్న సహకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ &nbsp;మరువకూడదు. &nbsp; ద్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించగలుగుతారా ఆని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. &nbsp;రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పాం చేసి చూపిస్తున్నాం. ప్రజలు, పరిశ్రమలు ఏపీని విశ్వసిస్తున్నాయి. దేశంలోని ఏ రాష్ట్రమూ తీసుకురాని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతాను తీసుకువచ్చాం... దీనికి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తాం. లేబర్ కోడ్ గైడ్ లైన్స్ విషయంలోనూ కేంద్రం ఏపీని సంప్రదించింది. &nbsp;అందుకే ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ను అమలు చేయాలని నిర్ణయించామన్నారు. .</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/health/air-fryers-are-the-best-investment-for-health-do-you-know-why-230593" width="631" height="381" scrolling="no"></iframe><br />&nbsp;</p>
Read Entire Article