BRS On Rohit Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు

4 weeks ago 5
ARTICLE AD
<p data-path-to-node="0">హైదరాబాద్: మొయినాబాద్&zwnj; లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్&zwnj;లో జరిగిన డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో రోహిత్ రెడ్డి ప్రమేయంపై భారత రాష్ట్ర సమితి (BRS) అధిష్టానం గుర్రుగా ఉంది. నిందితుడిగా ఉండటంతో పాటు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో ఆయనపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. పార్టీ ప్రతిష్ఠకు, విశ్వసనీయతకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా దీనిపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని, ఒకవేళ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పార్టీ స్పష్టం చేసింది. తుది నిర్ణయం వెలువడే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయనను ఆదేశించింది.</p> <p data-path-to-node="2"><strong>రోహిత్ రెడ్డి ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీ..</strong></p> <p data-path-to-node="2">&nbsp;మొయినాబాద్&zwnj;లోని రోహిత్ రెడ్డి ఫాంహౌస్&zwnj;పై పోలీసులు శనివారం రాత్రి ఆకస్మిక దాడి చేసినప్పుడు అక్కడ మాదకద్రవ్యాల వినియోగం జరిగినట్లు ఆధారాలు లభించాయి. ఈ పార్టీలో <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a> నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్&zwnj;, ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. పోలీసుల సోదాల్లో కొకైన్ వంటి నిషేధిత పదార్థాలతో పాటు ఫారిన్ రివాల్వర్ (.32 క్యాలిబర్) స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి హాజరైన వారిలో ఆరుగురికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఈ కేసు మరింత ముదిరింది. నిందితులు తొలుత బుకాయించినప్పటికీ, వైద్య పరీక్షలలో ఎంపీ పుట్టా మహేష్&zwnj;తో పాటు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ మొత్తం ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ తెలిపారు.&nbsp;</p> <p data-path-to-node="3">మొయినాబాద్ పోలీసులు ఈ కేసును డ్రగ్స్ సరఫరా, ఆయుధాల చట్టం (Arms Act) కింద దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఈ ఒక్క పార్టీయే కాకుండా, గతంలో కూడా ఇలాంటి కార్యకలాపాలు జరిగాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మధ్య ఉన్న ఈ డగ్రస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అధికార <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> తో పాటు <a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a> నేతల విమర్శలను సీరియస్ గా తీసుకున్న పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు బీఆర్&zwnj;ఎస్ నాయకత్వం రోహిత్ రెడ్డిని పక్కన పెడుతూ నిర్ణయం తీసుకుంది.</p> <h4 data-path-to-node="0"><strong data-path-to-node="0" data-index-in-node="0">మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు</strong></h4> <p data-path-to-node="1">హైదరాబాద్ శివారు మొయినాబాద్ మండలం అజీజ్ నగర్&zwnj;లోని ఫామ్&zwnj;హౌస్&zwnj;లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు ప్రకారం, మార్చి 14, 2026 రాత్రి జరిగిన ఈ పార్టీలో నిందితుడు నమిత్ శర్మ పోలీసులపైకే కాల్పులు జరిపారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందిన రివాల్వర్&zwnj;తో పోలీసులను భయపెట్టి తప్పించుకునేందుకు కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.</p> <p data-path-to-node="2">ఘటనా స్థలంలో జర్మనీ తయారీ రివాల్వర్, లైవ్ బుల్లెట్, 0.26 గ్రాముల కొకైన్&zwnj;తో పాటు రాయల్ సెల్యూట్, చివాస్ రీగల్ వంటి ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఏ-1గా నమిత్ శర్మ, ఏ-2 రోహిత్ రెడ్డి సహా మొత్తం 11 మందిపై ఎన్డీపీఎస్ (NDPS), ఆర్మ్స్ యాక్ట్, బీఎన్ఎస్ (BNS) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుల్లో వ్యాపారవేత్తలు, సాఫ్ట్&zwnj;వేర్ ఉద్యోగులు ఉండటం గమనార్హం.&nbsp;</p>
Read Entire Article