BJP Files Notice Against Rahul Gandhi: రాహుల్ గాంధీ పోటీ చేసే అర్హత కోల్పోతారా? లోక్‌సభలో బీజేపీ నేత చేసిన తీర్మానం ఏంటీ?

2 months ago 5
ARTICLE AD
<p><strong>BJP Files Notice Against Rahul Gandhi:</strong> <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఎంపీ నిషికాంత్ దూబే లోక్&zwnj;సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారత్&zwnj;-అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం, &nbsp;కేంద్ర బడ్జెట్&zwnj;పై ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేసిన వేళ ఈ చర్య తీసుకున్నారు.</p> <p>దేశాన్ని రాహుల్ గాంధీ తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తూ లోక్&zwnj;సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు బిజెపి ఎంపి నిషికాంత్ దూబే గురువారం ప్రకటించారు. ఈ విషయాన్ని చర్చించాలని, రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయన జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని తన తీర్మానంలో డిమాండ్ చేస్తున్నట్లు దూబే అన్నారు.</p> <p>అయితే, రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ మోషన్ తీసుకొచ్చే ఆలోచన లేదని దూబే స్పష్టం చేశారు. ఇది రాహుల్ గాంధీని పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఒక స్వతంత్ర తీర్మానం అని ఆయన అన్నారు.</p> <p>ANIతో మాట్లాడుతూ , నిషికాంత్ దూబే తన ప్రతిపాదనలో, జార్జ్ సోరోస్ వంటి బాహ్య శక్తుల మద్దతుతో రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారని అన్నారు.</p> <blockquote class="twitter-tweet" data-media-max-width="560"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | On LoP, Lok Sabha, Rahul Gandhi's statement in Parliament, BJP MP Nishikant Dubey says," I have moved a motion in Lok Sabha today against Rahul Gandhi on how he is misleading the nation with the help of forces like Soros, who want to harm the nation. In the motion I have&hellip; <a href="https://t.co/MECVIGHdyh">pic.twitter.com/MECVIGHdyh</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/2021826662623818214?ref_src=twsrc%5Etfw">February 12, 2026</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>బుధవారం లోక్&zwnj;సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో ప్రభుత్వం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఆరోపించారు. ప్రపంచం ప్రస్తుతం అస్థిరంగా ఉందని, ఇక్కడ ఇంధనం, ఆర్థిక వనరులను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని ప్రభుత్వమే గుర్తిస్తుందని ఆయన అన్నారు. అయినప్పటికీ, భారత్&zwnj; తన ఇంధన భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలలో అమెరికాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన అన్నారు.</p> <p><a title="రాహుల్ గాంధీ" href="https://telugu.abplive.com/topic/Rahul-Gandhi" data-type="interlinkingkeywords">రాహుల్ గాంధీ</a> ప్రసంగాన్ని "అపరిపక్వమైంది" అని అభివర్ణిస్తూ, పలువురు బిజెపి నాయకులు విమర్శించారు. ప్రతిపక్షం దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నదని వారు అన్నారు.</p>
Read Entire Article