Bharat Taxi: ఓలా, ఉబెర్‌కు ప్రత్యామ్నాయంగా భారత్ టాక్సీ - ఇది ఎలా పని చేస్తుందో తెలుసా?

3 months ago 9
ARTICLE AD
<p><strong>Bharat Taxi cooperative model app:</strong> కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న &nbsp;భారత్ టాక్సీ సహకార నమూనాలో నడుస్తుంది. &nbsp; ప్రైవేట్ క్యాబ్ దిగ్గజాలు ఓలా, ఉబర్&zwnj;లకు గట్టి పోటీనిస్తూ.. డ్రైవర్ల సంక్షేమమే పరమావధిగా ఈ సరికొత్త వ్యవస్థ పని చేయనుంది. &nbsp;</p> <p><strong>&nbsp;భారత్ టాక్సీ: డ్రైవర్లే యజమానులు - లాభమే లక్ష్యం కాదు!&nbsp;</strong><br />&nbsp;అమూల్ సంస్థలో పాడి రైతులు ఎలాగైతే వాటాదారులుగా ఉండి లాభాలను పంచుకుంటారో &nbsp;'భారత్ టాక్సీ'లో క్యాబ్ డ్రైవర్లు కూడా కేవలం పని చేసే వారు మాత్రమే కాదు, ఆ సంస్థలో &nbsp;వాటాదారులుగా ఉంటారు. 'సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్' ఆధ్వర్యంలో నడిచే ఈ ప్లాట్&zwnj;ఫారమ్, లాభాపేక్ష లేని ప్రైవేట్ సంస్థగా కాకుండా, వేలాది మంది డ్రైవర్లు కలిసి నడిపే ఒక సహకార సంఘంగా పని చేస్తుంది. వీరికి 'సారథులు' అని పేరు పెట్టారు.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p><strong>&nbsp;2. జీరో కమిషన్ - డ్రైవర్లకు పూర్తి ఆదాయం&nbsp;</strong><br />ప్రస్తుతం ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ సంస్థలు ఒక్కో రైడ్&zwnj;పై డ్రైవర్ల నుండి 20% నుండి 30% వరకు కమిషన్ వసూలు చేస్తున్నాయి. కానీ, భారత్ టాక్సీ &nbsp;జీరో కమిషన్ మోడల్&zwnj;ను అనుసరిస్తుంది. అంటే, ప్రయాణీకుడు చెల్లించే మొత్తం &nbsp;నేరుగా డ్రైవర్&zwnj;కే చెందుతుంది. ఈ వ్యవస్థ నడవడానికి డ్రైవర్లు కేవలం స్వల్ప మొత్తంలో నెలవారీ లేదా రోజువారీ మెంబర్&zwnj;షిప్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <p><strong>&nbsp;3. వినియోగదారులకు &nbsp;సర్జ్ ప్రైసింగ్ భయం లేదు&nbsp;</strong><br />కస్టమర్లకు ఈ భారత్ టాక్సీ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం నో సర్జ్ ప్రైసింగ్ . సాధారణంగా వర్షం పడినప్పుడు లేదా రద్దీ సమయాల్లో ప్రైవేట్ యాప్&zwnj;లు ధరలను రెట్టింపు చేస్తాయి. కానీ భారత్ టాక్సీలో ధరలు పారదర్శకంగా, ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం స్థిరంగా ఉంటాయి. దీనివల్ల సామాన్య ప్రయాణీకులపై అదనపు భారం పడదు.</p> <p><strong>&nbsp;4. &nbsp;డిజిటల్ అనుసంధానం&nbsp;</strong><br />ఈ ప్రాజెక్టు వెనుక అమూల్, ఇఫ్కో (IFFCO), నాబార్డ్ (NABARD) వంటి దిగ్గజ సహకార సంస్థల మద్దతు ఉంది. ఇది ప్రభుత్వ 'డిజిటల్ ఇండియా' విజన్&zwnj;కు అనుగుణంగా డిజిలాకర్, ఉమాంగ్ (UMANG) వంటి ప్రభుత్వ యాప్&zwnj;లతో అనుసంధానించి ఉంటుంది. &nbsp;ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ సేవలు జనవరి 1, 2026 నుండి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. 2030 నాటికి దేశవ్యాప్తంగా లక్ష మంది డ్రైవర్లను చేర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <p>ప్రయాణీకుల భద్రత కోసం ఈ యాప్&zwnj;లో రియల్ టైమ్ జీపీఎస్ ట్రాకింగ్, డ్రైవర్ల వెరిఫికేషన్ మరియు స్థానిక పోలీసులతో అనుసంధానం వంటి ఫీచర్లు ఉన్నాయి. మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ ద్వారా సామాన్యులు కూడా ఈజీగా ఈ సేవలను వినియోగించుకోవచ్చు.&nbsp; &nbsp; &nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/news/how-many-hindus-are-there-in-bangladesh-what-are-their-conditions-like-231415" width="631" height="381" scrolling="no"></iframe></p>
Read Entire Article