Basara Temple Master Plan: రూ.225 కోట్ల‌తో బాస‌ర స‌ర‌స్వ‌తి ఆల‌యం పునర్ నిర్మాణం.. 9 అంత‌స్తుల రాజ‌గోపురం, ఈశాన్యాన కోనేరు

1 week ago 2
ARTICLE AD
<p>ద&zwnj;క్షిణాది రాష్ట్రాల్లోని ఏకైక జ్ఞాన స&zwnj;ర&zwnj;స్వ&zwnj;తి ఆల&zwnj;యం.. అక్ష&zwnj;రాభాస్యాల&zwnj;కు ఆల&zwnj;వాల&zwnj;మైన బాసర క్షేత్రం పునఃనిర్మాణంతో కొత్త శోభ&zwnj;ను సంత&zwnj;రించుకోబోతోంది. వేద వ్యాస మ&zwnj;హ&zwnj;ర్షితో ప్ర&zwnj;తిష్ట&zwnj;త&zwnj;మైన ముగ్గురు అమ్మల ఆల&zwnj;యం ఆచారాల&zwnj;కు అనుగుణంగా సమున్నత&zwnj;మైన రాజ&zwnj;గోపురం.. కోనేరు, ఉత్తర ద్వారం అభివృద్ధి, ధ్యాన మందిరాలతో మ&zwnj;రింత&zwnj;గా భ&zwnj;క్తుల మ&zwnj;నస్సుల&zwnj;ను ఆకట్ట&zwnj;కోనుంది. వేల ఏళ్ల ఘ&zwnj;న చ&zwnj;రిత్ర ఉన్న బాసర జ్ఞాన స&zwnj;ర&zwnj;స్వ&zwnj;తి ఆల&zwnj;య (Basara Temple) పునః నిర్మాణాల&zwnj;కు తెలంగాణ ప్ర&zwnj;భుత్వం ఏకంగా రూ.225 కోట్ల&zwnj;ను కేటాయించింది. బాసర ఆలయ పునర్ నిర్మాణ ప&zwnj;నుల&zwnj;కు సీఎం ఎ.రేవంత్ రెడ్డి సోమ&zwnj;వారం (ఏప్రిల్ 6న) భూమి పూజ చేయ&zwnj;నున్నారు.&nbsp;</p> <p>ద&zwnj;క్షిణ గంగగా గుర్తింపు పొందిన గోదావ&zwnj;రి న&zwnj;దీ తీరంలోని బాస&zwnj;ర క్షేత్రంలో జ్ఞాన స&zwnj;ర&zwnj;స్వ&zwnj;తి దేవి కొలువై ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధానంత&zwnj;రం ప్ర&zwnj;శాంత&zwnj;త కోసం వేద వ్యాస మ&zwnj;హ&zwnj;ర్షి గోదావ&zwnj;రి తీరానికి వ&zwnj;చ్చి బాస&zwnj;ర&zwnj;లో నివ&zwnj;సించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ స&zwnj;మ&zwnj;యంలో స్వ&zwnj;యంగా ఆయ&zwnj;నే గోదావ&zwnj;రి ఇసుక&zwnj;తో జ్ఞాన స&zwnj;ర&zwnj;స్వ&zwnj;తితో పాటు మ&zwnj;హాల&zwnj;క్ష్మి, మ&zwnj;హా కాళి అమ్మ వార్ల మూర్తుల&zwnj;ను ప్ర&zwnj;తిష్టించార&zwnj;నేది స్థ&zwnj;ల పురాణం.. అలా ముగ్గురమ్మ&zwnj;ల కొలువైన క్షేత్రంగా బాస&zwnj;ర ప్ర&zwnj;సిద్ధి చెందింది.</p> <p><strong>అక్ష&zwnj;రాభ్యాసాల&zwnj;తో...</strong></p> <p>జ్ఞాన స&zwnj;ర&zwnj;స్వ&zwnj;తి కొలువైన క్షేత్రం కావ&zwnj;డంతో ప్ర&zwnj;తి ఏటా పెద్ద సంఖ్య&zwnj;లో పిల్ల&zwnj;ల&zwnj;కు ఇక్క&zwnj;డ అక్ష&zwnj;రాభ్యాసాలు చేయిస్తుంటారు. వ&zwnj;సంత పంచ&zwnj;మి, ఇత&zwnj;ర ప&zwnj;ర్వ దినాల్లో అక్ష&zwnj;రాభ్యాసాల&zwnj;కు వ&zwnj;చ్చే పిల్ల&zwnj;లు, త&zwnj;ల్లిదండ్రులు, వారి బంధువులు, భ&zwnj;క్తుల&zwnj;తో ఆల&zwnj;యం కిట&zwnj;కిట&zwnj;లాడుతుంది. ప్రాచీన ఆల&zwnj;యం కావ&zwnj;డం.. ఏటేటా పెరుగుతున్న భ&zwnj;క్తుల సంఖ్య&zwnj;కు త&zwnj;గిన&zwnj;ట్లు అభివృద్ధి ప&zwnj;నులు చేప&zwnj;ట్ట&zwnj;పోవ&zwnj;డంతో భ&zwnj;క్తులు తీవ్ర ఇబ్బందుల&zwnj;కు గుర&zwnj;వుతున్నారు.. ఈ క్రమంలో బాస&zwnj;ర ఆల&zwnj;య అభివృద్ధి చేప&zwnj;ట్టాల&zwnj;ని గౌర&zwnj;వ ముఖ్య&zwnj;మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించింది. సంప్ర&zwnj;దాయాలు, ఆచారాల&zwnj;కు అనుగుణంగా ఆల&zwnj;య అభివృద్ధి ప&zwnj;నులు చేప&zwnj;ట్టేందుకు మాస్ట&zwnj;ర్ ప్లాన్ త&zwnj;యారు చేయాల&zwnj;ని అధికారుల&zwnj;ను సీఎం ఆదేశించారు.</p> <p><strong>శృంగేరి పీఠాధిప&zwnj;తుల నుంచి అనుమ&zwnj;తి</strong></p> <p>బాస&zwnj;ర ఆల&zwnj;య పునఃనిర్మాణ ప&zwnj;నుల&zwnj;కు మాస్ట&zwnj;ర్ ప్లాన్ రూపొందించే ముందు అధికారులు శృంగేరి పీఠాధిప&zwnj;తుల&zwnj;ను సంప్ర&zwnj;దించారు. గ&zwnj;ర్భాల&zwnj;యం, అర్ధ మండ&zwnj;పం, రాజ గోపురం, ఇత&zwnj;ర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్త&zwnj;ర ద్వారాల నిర్మాణాల&zwnj;కు సంబంధించి పీఠాధిపతుల నుంచి అనుమ&zwnj;తులు తీసుకున్నారు. వారి సూచ&zwnj;న&zwnj;ల&zwnj;కు అనుగుణంగా మాస్ట&zwnj;ర్ ప్లాన్&zwnj;ను రూపొందించారు.&nbsp;</p> <p><strong>విశాలంగా.. సౌక&zwnj;ర్యంగా....</strong></p> <p>భ&zwnj;క్తుల సంఖ్య&zwnj;.. భ&zwnj;విష్య&zwnj;త్ అవ&zwnj;స&zwnj;రాల&zwnj;ను దృష్టిలో పెట్టుకొని ప్ర&zwnj;స్తుతం 2 వేల చ&zwnj;ద&zwnj;ర&zwnj;పు అడుగుల్లో ఉన్న గ&zwnj;ర్భాల&zwnj;యం, అర్ధ మండ&zwnj;పాన్ని 5 వేల చ&zwnj;ద&zwnj;ర&zwnj;పు అడుగుల&zwnj;కు పెంచుతున్నారు. ఉత్త&zwnj;రం వైపున 9 అంత&zwnj;స్తుల రాజ&zwnj;గోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడ&zwnj;ల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు, ఉత్త&zwnj;ర ద్వారం నిర్మించ&zwnj;నున్నారు. మొత్తంగా ఆల&zwnj;య విస్తీర్ణాన్ని 20 వేల చ&zwnj;ద&zwnj;ర&zwnj;పు అడుగుల నుంచి 62 వేల చ&zwnj;ద&zwnj;ర&zwnj;పు అడుగుల&zwnj;కు పెంచుతున్నారు...</p> <p><strong>శిలా నిర్మాణాలు...&nbsp;</strong></p> <p>బాసర సరస్వతీ అమ్మవారి ఆల&zwnj;యంలో ప్ర&zwnj;తి నిర్మాణాన్ని శిల&zwnj;ల&zwnj;తో చేప&zwnj;ట్ట&zwnj;నున్నారు. 6 వేల మంది భ&zwnj;క్తులకు అన్ని వ&zwnj;స&zwnj;తుల&zwnj;తో (ఫీడింగ్ రూమ్&zwnj;, ఫుడ్ స్టాల్స్&zwnj;, టాయిలెట్స్ త&zwnj;దిత&zwnj;రాల&zwnj;తో) 70 వేల చ&zwnj;ద&zwnj;ర&zwnj;పు అడుగుల&zwnj;తో క్యూ కాంప్లెక్స్&zwnj;లు, 200 మంది ఏక&zwnj;కాలంలో కూర్చొని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20 వేల చ&zwnj;ద&zwnj;ర&zwnj;పు అడుగుల వైశాల్యంతో వంట శాల&zwnj;, భోజ&zwnj;న శాల&zwnj;లు, ప్ర&zwnj;సాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు... తూర్పు దిక్కున ఆధ్యాత్మిక&zwnj;త ప&zwnj;రిఢ&zwnj;విల్లేలా అద్భుత&zwnj;మైన తోర&zwnj;ణాలు, స&zwnj;మాచార కేంద్రం, దేవాల&zwnj;యానికి ఉత్త&zwnj;ర&zwnj;, తూర్పు దిక్కుల్లో రోడ్ల అభివృద్ధి, దేవాల&zwnj;యం నుంచి ఆవ&zwnj;త&zwnj;లి వైపు వెళ్లేందుకు అండ&zwnj;ర్ పాస్&zwnj;, ఆవ&zwnj;త&zwnj;లి వైపున సోలార్ రూప్&zwnj;టాప్&zwnj;తో వాహ&zwnj;నాల పార్కింగ్&zwnj;, దేవాల&zwnj;య ప్రాంగణంలో ఆహ్లాద&zwnj;క&zwnj;ర&zwnj;మైన మొక్క&zwnj;లతో పుష్ప&zwnj;వ&zwnj;నం ప&zwnj;నులు చేప&zwnj;ట్ట&zwnj;నున్నారు. ఆల&zwnj;య ప్రాంగ&zwnj;ణం ఆవ&zwnj;ల హెల్త్ సెంట&zwnj;ర్ ఏర్పాటు చేయ&zwnj;నున్నారు.. భ&zwnj;విష్య&zwnj;త్&zwnj;లో ఆల&zwnj;యం వెనుక భాగం భారీ వృక్షాల&zwnj;తో ఆల&zwnj;రారేలా మొక్క&zwnj;లు నాట&zwnj;నున్నారు..</p> <p><strong>పుష్క&zwnj;రాల&zwnj;కు వ&zwnj;చ్చే వారికి ఏర్పాట్లు...</strong></p> <p>గోదావ&zwnj;రి న&zwnj;ది పుష్క&zwnj;రాలు వ&zwnj;చ్చే ఏడాది జూన్ లో ప్రారంభంకానున్నాయి. పుష్క&zwnj;రాల స&zwnj;మ&zwnj;యంలో ల&zwnj;క్ష&zwnj;లాది మంది భ&zwnj;క్తులు పుణ్య స్నానాల&zwnj;కు బాస&zwnj;ర గోదావ&zwnj;రి తీరానికి చేరుకుంటారు. వారికి అవ&zwnj;స&zwnj;ర&zwnj;మైన అన్ని వ&zwnj;స&zwnj;తులు ప్ర&zwnj;స్తుత మాస్ట&zwnj;ర్&zwnj;ప్లాన్&zwnj;లో భాగంగా చేప&zwnj;ట్ట&zwnj;నున్నారు. ఏ ఒక్క భ&zwnj;క్తుడు ఇబ్బంది ప&zwnj;డ&zwnj;కుండా అదే స&zwnj;మ&zwnj;యంలో ఆల&zwnj;య సంప్ర&zwnj;దాయాలు, భ&zwnj;క్తుల విశ్వాసాల&zwnj;కు అనుగుణంగా ప&zwnj;నులు చేప&zwnj;ట్టాల&zwnj;ని సీఎం <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> అధికారుల&zwnj;ను ఆదేశించారు.</p>
Read Entire Article