<p><strong>Manchu manoj Reaction on Bandi Bhageerath POCSO Case:</strong> కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనూ, సోషల్ మీడియాలోనూ పెను సంచలనంగా మారింది. ఈ కేసుపై నటుడు మంచు మనోజ్ అత్యంత తీవ్రంగా స్పందించారు. ఈ కేసు తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ, మైనర్ బాలికల రక్షణే ధ్యేయంగా వచ్చిన ఈ చట్టం ఎవరికీ చుట్టం కాకూడదన్నారు.</p>
<p><strong>వెంటనే చర్యలు తీసుకోవాలన్న మంచు మనోజ్ </strong></p>
<p>పోక్సో చట్టం ప్రతి మైనర్ బాలికకు న్యాయం చేకూర్చడానికే పుట్టింది. అధికారం, హోదా, పలుకుబడి లేదా సామాజిక స్థాయి న్యాయ ప్రక్రియకు ఏమాత్రం అడ్డురాకూడదు. రాజ్యాంగం , చట్టం ముందు ప్రతి అమ్మాయికి సమాన న్యాయం పొందే హక్కు ఉంది. మైనర్లకు సంబంధించిన కేసుల్లో అత్యంత వేగంగా, పారదర్శకంగా విచారణ జరగాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా, మౌనం వహించినా అది వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఇది రాజకీయాలకు,వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు, కేవలం సత్యం బయటకు రావాలి, బాధితురాలికి న్యాయం జరగాలి. ఎవరూ చట్టానికి అతీతులు కారని నిరూపించేలా, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఈ విచారణ సాగాలని కోరుకుంటున్నాను. న్యాయం జరగడమే కాదు, అది జరుగుతున్నట్లు అందరికీ కనిపించాలి అని ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లుగా తెలిపారు. </p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en">The recent POCSO case involving Bandi Bhageerath, son of Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar Garu, has deeply disturbed me.<br /><br />I strongly believe the <a href="https://twitter.com/hashtag/POCSO?src=hash&ref_src=twsrc%5Etfw">#POCSO</a> Act was created to make sure every minor girl gets justice no matter what.<br /><br />Power, position,…</p>
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) <a href="https://twitter.com/HeroManoj1/status/2053777893478858795?ref_src=twsrc%5Etfw">May 11, 2026</a></blockquote>
<p>
<script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script>
<br />కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి <a title="బండి సంజయ్" href="https://telugu.abplive.com/topic/Bandi-Sanjay" data-type="interlinkingkeywords">బండి సంజయ్</a> కుమారుడు బండి భగీరథ్‌పై హైదరాబాద్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఒక మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. బాధితురాలి తరపున అందిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 74 మహిళా గౌరవానికి భంగం కలిగించడం , పోక్సో చట్టంలోని సెక్షన్ 12 (లైంగిక వేధింపులు) తో పాటు పలు ఇతర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక కేంద్ర మంత్రి కుమారుడు ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. <br /> <br /> మైనర్ బాలికల రక్షణ కోసం రూపొందించిన పోక్సో చట్టం ప్రకారం, ఇలాంటి కేసుల్లో నిందితుల హోదాతో సంబంధం లేకుండా తక్షణమే విచారణ చేపట్టాల్సి ఉంటుంది. ఈ రాజకీయ పలుకుబడి ఈ కేసుపై ప్రభావం చూపిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో, పోలీసులు పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. పోలీసులు సాంకేతిక ఆధారాలను, ఫోన్ రికార్డులను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సీఎం కూడా ఈ అంశంపై స్పందించి డీజీపీ సీవీ ఆనంద్ కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. </p>
<p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/spirituality/these-are-the-richest-temples-in-india-246954" width="631" height="381" scrolling="no"></iframe><br /> </p>