<p><strong>At Home Event In Telugu States Rajbhawan: </strong>గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజ్ భవన్‌లో 'ఎట్ హోం' కార్యక్రమం ఘనంగా సాగింది. ఆదివారం సాయంత్రం విజయవాడలోని రాజ్ భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> (CM Chandrababu), ఆయన సతీమణి భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు <a title="నారా లోకేశ్" href="https://telugu.abplive.com/topic/Nara-Lokesh" data-type="interlinkingkeywords">నారా లోకేశ్</a>, నారాయణ, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, సవిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎస్, డీజీపీ, ఇతర సీనియర్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్యనేతలు హాజరయ్యారు. ఆహ్లాదకర వాతావరణంలో ఈవెంట్ సాగింది. </p>
<p>అటు, తెలంగాణలోని రాజ్ భవన్‌లో నిర్వహించిన 'ఎట్ హోం' కార్యక్రమం ఆహ్లాదంగా సాగింది. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.</p>
<p><strong>Also Read: <a title="Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/telangana/telangana-cm-revanth-reddy-launched-four-new-welfare-schemes-195565" target="_blank" rel="noopener">Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి</a></strong></p>
<p> </p>