Assam Assembly Elections 2026: అస్సాంలో కాంగ్రెస్ పతనాన్ని శాసించింది హిమంతనే - ఒకప్పటి రాహుల్ స్నేహితుడు - బిస్కెట్ వల్లే బీజేపీలోకి!

1 month ago 6
ARTICLE AD
<p><strong>Rahul is the reason for Congress plight in Assam: &nbsp;</strong>అసోం రాజకీయాల్లో ప్రస్తుతం హిమంత బిశ్వ శర్మ ఒక అజేయమైన శక్తిగా ఎదిగారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ జెండాను రెపరెపలాడించడంలో ఆయన పోషించిన పాత్ర అత్యంత కీలకం. అయితే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కు కుడిభుజంగా ఉన్న హిమంత.. ఆ పార్టీకి ఎందుకు దూరమయ్యారు అనే అంశంపై ఇప్పటికీ అనేక ఆసక్తికరమైన చర్చలు జరుగుతుంటాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీతో జరిగిన ఒక చేదు అనుభవం ఆయన రాజకీయ ప్రయాణాన్ని పూర్తిగా మార్చివేసింది.</p> <p><strong>కాంగ్రెస్ కు దూరం చేసిన బిస్కెట్ వివాదం&nbsp;</strong></p> <p>హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ ను వీడటానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ తీరు అని ఆయన అనేకసార్లు బహిరంగంగానే చెప్పారు. అప్పట్లో అస్సాం కాంగ్రెస్ లో తలెత్తిన నాయకత్వ మార్పు గురించి చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలో <a title="రాహుల్ గాంధీ" href="https://telugu.abplive.com/topic/Rahul-Gandhi" data-type="interlinkingkeywords">రాహుల్ గాంధీ</a> తన పెంపుడు కుక్క పిడికి బిస్కెట్లు తినిపిస్తూ బిజీగా ఉన్నారు. &nbsp;రాజకీయ అంశాలను చర్చించడానికి వచ్చిన సీనియర్ నేతలను కనీసం పట్టించుకోలేదు. &nbsp;నాయకులు కూర్చున్న టేబుల్ పై ఉన్న ప్లేట్ లోనే కుక్క బిస్కెట్లు తింటున్నా రాహుల్ వారించలేదు. ఈ నిర్లక్ష్య వైఖరి తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందని హిమంత చాలా సార్లు చెప్పారు. ఆ క్షణమే కాంగ్రెస్ లో తన ప్రయాణం ముగిసిందని నిర్ణయించుకున్నారు.</p> <p>బీజేపీలో చేరికతో అస్సాం రాజకీయాల్లో పెను మార్పులు&nbsp;</p> <p>2015లో బీజేపీలో చేరిన తర్వాత హిమంత వెనుదిరిగి చూడలేదు. అప్పటికే అస్సాంలో కాంగ్రెస్ పట్ల ఉన్న వ్యతిరేకతను ఆయన తన అనుకూలంగా మార్చుకున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పట్టు, అసాధారణమైన వ్యూహరచనతో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో విజయం సాధించారు. నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ &nbsp;కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టి, కేవలం అస్సాంలోనే కాకుండా ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ బీజేపీ , మిత్రపక్షాల ప్రభుత్వాలు ఏర్పడేలా పావులు కదిపారు. 2021లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఒక బలమైన హిందూత్వవాదిగా , కఠినమైన నిర్ణయాలు తీసుకునే పాలకుడిగా గుర్తింపు పొందారు.</p> <p><strong>&nbsp;విపక్షాలను నిర్వీర్యం చేసిన &nbsp;హిమంత</strong></p> <p>హిమంత బిశ్వ శర్మ కేవలం పాలనలోనే కాకుండా రాజకీయ వ్యూహాల్లోనూ సిద్ధహస్తులు. కాంగ్రెస్ లో ఉన్న లోపాలను, అక్కడి నాయకత్వ లేమిని ఆయన సరిగ్గా వాడుకున్నారు. అస్సాం స్థానిక సమస్యలైన చొరబాటుదారులు, పౌరసత్వ సవరణ చట్టం &nbsp;, భూగర్భ జలాల సమస్య వంటి అంశాలపై ఆయన స్పష్టమైన స్టాండ్ తీసుకున్నారు. మైనార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు స్వస్తి పలికి, స్వదేశీ అస్సామీల ప్రయోజనాలే పరమావధిగా ఆయన చేసే ప్రసంగాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. దీనివల్ల ఒకప్పుడు కాంగ్రెస్ కోటగా ఉన్న అస్సాం ఇప్పుడు బీజేపీకి బలమైన కేంద్రంగా మారింది.</p> <p><strong>&nbsp;జాతీయ రాజకీయాల్లో ఎదుగుతున్న స్టార్&nbsp;</strong></p> <p>నేడు హిమంత బిశ్వ శర్మ కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ బీజేపీకి ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ గా మారారు. <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> తన సొంత నేతలను ఎలా నిర్లక్ష్యం చేస్తుందో చెప్పడానికి <a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a> ప్రతిసారీ హిమంత ఉదాహరణనే చూపిస్తుంది. అభివృద్ధి పనులు వేగవంతం చేయడం, పోలీస్ సంస్కరణలు తీసుకురావడం వంటి చర్యలతో ఆయన తనదైన ముద్ర వేశారు. అస్సాం ప్రజల్లో ఉన్న అసంతృప్తిని జాతీయ వాదంతో జోడించి ఆయన సృష్టించిన పొలిటికల్ డైనమిక్స్ రాబోయే దశాబ్దాల పాటు ఆ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి.&nbsp; &nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/business/how-to-open-a-demat-account-online-239137" width="631" height="381" scrolling="no"></iframe></p>
Read Entire Article