Arunachalam Crime: అరుణాచలంలో తెలుగు యాత్రికురాలిపై ఘోరం - అత్యాచారం చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లు

2 months ago 3
ARTICLE AD
<p>Police rape Telugu devotee in Arunachalam: అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని తిరువణ్ణామలై సమీపంలో ఆంధ్రప్రదేశ్&zwnj;కు చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారం చేసిన ఘటన సంచలనంగా మారింది. &nbsp;ఆమెపై అత్యాచారం చేసిన పోలీసులను &nbsp; అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు.&nbsp;</p> <p>సోమవారం &nbsp;రాత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి తిరువణ్ణామలై సమీపంలోని ఎంథాల్ బైపాస్ రోడ్డుపై ఇద్దరు మహిళలు, ముగ్గురు వ్యక్తులు, డ్రైవర్&zwnj;తో సహా &nbsp;వాహనంలో వచ్చారు. &nbsp;ఆ సమయంలో బైపాస్ రోడ్డుపై రాత్రి గస్తీ నిర్వహిస్తున్న తిరువణ్ణామలై ఈస్ట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు సుందర్, సురేశ్&zwnj;రాజ్&zwnj;లు వాహనాన్ని అడ్డగించి వాహనంలో ఉన్న వారిని కిందకు దించారు. అందర్నీ &nbsp;దింపి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో ప్రశ్నించారు.&nbsp;</p> <p>ఆ సమయంలో యువతి లక్ష్మిపై వారి కన్ను పడింది. ఆమె దగ్గర అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని కొట్టి.. ఆమెను సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోని &nbsp;పొదల్లోకి ఈడ్చుకెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత &nbsp;బైపాస్ రోడ్డు పక్కనే వదిలేసి ఇద్దరు పోలీసులు అక్కడి నుంచి పరారయ్యారు. &nbsp;తెల్లవారుజామున 4 గంటలకు అక్కడికి వచ్చిన గ్రామస్థులు లక్ష్మిని రక్షించి 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.&nbsp;</p> <p>ఈ సమాచారం తెలుసుకున్న తిరువణ్ణామలై జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సుధాకర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ బాధితురాలిని పరామర్శించారు. ఏం జరిగిందో స్వయంగా తెలుసుకున్నారు. ఈ విచారణలో &nbsp;రాత్రి జరిగిన విషయాన్ని బాధితురాలు చెప్పింది. దీంతో &nbsp;జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలిచారు. అంతేకాకుండా, తిరువణ్ణామలై మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 5 మంది పోలీసు ఇన్&zwnj;స్పెక్టర్లు సహా 10 మందికి పైగా పోలీసు అధికారులను మోహరించారు. &nbsp;రేపిస్టులిద్దరూ పోలీసులే కావడంతో తిరువణ్ణామలై జిల్లాలో తీవ్ర ఉత్కంఠ రేపింది. వారిద్దర్నీ అరెస్టు చేసిన పోలీసులు ..విచారణ జరుపుతున్నారు.&nbsp;</p> <p>ఇటీవలి కాలంోల అరుణాచలంలో తెలుగు యాత్రికులపై దాడులు పెరుగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు అరుణాచలం వెళ్తూండటంతో తెలుగు యాత్రికులపై వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇది ద్వేషంగా పెంచుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు స్వయంగా పోలీసులే అత్యాచారనికి పాల్పడటం సంచలనంగా మారింది.&nbsp;</p>
Read Entire Article