APSRTC : ఏపీఎస్ఆర్టీసీకి కలిసొచ్చిన సంక్రాంతి పండుగ.. రూ.12 కోట్ల ఆదాయంతో రికార్డ్ కలెక్షన్‌లు

10 months ago 9
ARTICLE AD
<p><strong>APSRTC :</strong> సంక్రాంతి(Sankranthi) పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ - ఏపీఎస్ఆర్టీసీ (<span data-huuid="17282295889372038616">Andhra Pradesh State Road Transport Corporation</span>) 7,200 ప్రత్యేక బస్సులు నడిపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.12 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆర్టీసీ యాజమాన్యం (RTC Management) వెల్లడించింది. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులో దాదాపుగా 4లక్షల మంది ప్రయాణించినట్టు తెలిపింది. కనుమ(Kanuma)తో సంక్రాంతి పండుగ సంబురాలు పూర్తయినప్పటికీ.. చాలా మంది ఇంకా తిరుగు ప్రయాణం చేయలేదు. అందులోనూ వీకెండ్ దగ్గరగా ఉండడంతో సెలవుల్లో కుటుంబంతో గడుపుతున్నారు. ఇక తిరుగుప్రయాణాలు ప్రారంభం కాకపోవడంతో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏపీఎస్ఆర్టీసీ నడిపిన 7200 బస్సుల్లో 2153 బస్సులు హైదరాబాద్(Hyderabad) నుంచే ఉండడం గమనార్హం.</p> <p><strong>ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్</strong></p> <p>సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) స్పెషల్ బస్సులు వేసింది. జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు(Special Buses) నడపనున్నట్టు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. తిరుగు ప్రయాణం చేసే వారికి అనుకూలంగా 3200 అదనపు బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ తెలిపింది. అయితే ఈ స్పెషల్ బస్సుల్లో ఎలాంటి ఎక్స్ ట్రా ఛార్జీలు(Extra Charges) వసూలు చేయమని చెప్పడం చెప్పుకోదగిన విషయం. అంతే కాకుండా పలు బస్సుల్లో ప్రత్యేక ఆఫర్లను సైతం ప్రకటించారు. ఇరువైపులా ప్రయాణానికి ఒకేసారి టిక్కెట్లు బుక్ చేసుకుంటే మొత్తం ఛార్జీలో 10శాతం రాయితీ ఇస్తామని చెప్పారు.</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/education/telangana-entrance-exam-dates-2025-mba-icet-bed-eapcet-mca-lawcet-194222" width="631" height="381" scrolling="no"></iframe></p> <p><strong>ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ పథకం<br /></strong></p> <p>ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఆంధ్రప్రదేశ్&zwnj;లో కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో ప్రధానమైంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free Bus Journey). కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినప్పటికీ దీనిపై ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా ఈ పథకంపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మార్చి 8న మహిళా దినోత్సవం (Women's Day) నుంచి అమలు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలో జరిగే కేబినెట్ భేటీలో క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలపై చర్చించి.. అమలు తేదీలను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.</p> <p><strong>ప్రభుత్వంపై రూ. 277 కోట్లకు పైగా భారం&nbsp;</strong></p> <p>ఏపీ ప్రభుత్వం తీసుకురాబోయే ఈ కొత్త పథకం ద్వారా రోజుకు దాదాపు 20 లక్షల మందికిపైగా మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని వలన ప్రభుత్వంపై నెలకు రూ. 277 కోట్ల అదనపు భారం పడుతుందని అంటున్నారు. అందుకోసం అటు ప్రయాణికులపై భారం పడకుండా ఉన్న నిధుల్లోనే వీటిని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. <a title="కర్ణాటక" href="https://telugu.abplive.com/topic/Karnataka" data-type="interlinkingkeywords">కర్ణాటక</a>లోనూ ఈ తరహా పథకం అమలవుతున్నప్పటికీ నష్టాలు పూడ్చుకునేందుకు బస్సు ఛార్జీలను 15% పెంచుతున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పటికైతే ఏపీలో బస్సు ఛార్జీలు అధికంగా ఉన్నందున ఛార్జీల పెంపు ఉండకపోవచ్చని వాదన వినిపిస్తోంది.&nbsp;</p> <p><strong>Also Read : <a href="https://telugu.abplive.com/andhra-pradesh/amravati/free-bus-scheme-will-start-in-andhra-pradesh-from-march-2025-chandra-babu-ap-cabinet-pawan-kalyan-lokesh-194348">Free Bus Scheme in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్&zwnj;లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎప్పటి నుంచో తెలుసా!</a></strong></p>
Read Entire Article