AP Secretariat employee transfers: ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - అంతర్ జిల్లా బదిలీలకు జీవో రిలీజ్

2 weeks ago 2
ARTICLE AD
<p><strong>Good news for AP village and ward secretariat employees: &nbsp;</strong>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ (GSWS) ఉద్యోగులకు స్పౌస్ గ్రౌండ్స్&zwnj;పై &nbsp;అంతర్ జిల్లా &nbsp;ట్రాన్స్&zwnj;ఫర్&zwnj;లకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. &nbsp;పంచాయతీ రాజ్ &amp; గ్రామీణాభివృద్ధి జారీ చేసిన GO Ms. No. 145 ప్రకారం, భర్త/భార్యలు కలిసి పని చేయాలనే &nbsp; రిక్వెస్ట్ బేసిస్&zwnj;పై ఆన్&zwnj;లైన్ అప్లికేషన్&zwnj;ల ద్వారా ట్రాన్స్&zwnj;ఫర్&zwnj;లు అమలు చేయనున్నారు. &nbsp;పూర్తి ప్రక్రియను 30 నవంబర్ 2025 లోపు పూర్తి చేసుకోవాలని, మెరిట్ ర్యాంక్, సీనియారిటీ ఆధారంగా ట్రాన్స్&zwnj;ఫర్&zwnj;లు జరుగుతాయని అధికారులు తెలిపారు.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;<br />&nbsp;<br />గ్రామ వార్డు సచివాలయాల స్థాపన తర్వాత 2019-2020లో నియమితులైన 1.5 లక్షల మంది ఉద్యోగులు, తమ స్థానిక జిల్లాలకు ట్రాన్స్&zwnj;ఫర్&zwnj;ల కోసం డిమాండ్ చేస్తున్నారు. వీరిలో 25% మంది తమ స్వస్థలాలకు 200 కి.మీ. దూరంలో పని చేస్తున్నారు. &nbsp;ఇది మానసిక ఒత్తిడి, కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులకు కారణమవుతోంది. పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ GVNVV&amp;VSNVS విజయవాడ, ఉద్యోగుల అభ్యర్థనల ఆధారంగా ప్రభుత్వానికి లేఖ రాశారు. గతంలో 2023లో GO Ms. No. 5 ప్రకారం స్పౌస్, మ్యూచువల్ గ్రౌండ్స్&zwnj;పై ట్రాన్స్&zwnj;ఫర్&zwnj;లు అనుమతించినప్పటికీ, 2024లో రేషనలైజేషన్ GO No.1లో ఇంటర్-డిస్ట్రిక్ట్ స్పౌస్ ట్రాన్స్&zwnj;ఫర్&zwnj;లు మరింత స్పష్టత కల్పించారు.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;<br />&nbsp;<br />కొత్త మార్గదర్శకాల ప్రకారం, ట్రాన్స్&zwnj;ఫర్&zwnj;లు రిక్వెస్ట్ బేసిస్&zwnj;పై మాత్రమే జరుగుతాయి. ఆన్&zwnj;లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. &nbsp;భర్త/భార్యల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయితే మాత్రమే అయి ఉండాలి. ప్రైవేట్ ఉద్యోగులకు ఇది వర్తించదు. ట్రాన్స్&zwnj;ఫర్ యూనిట్&zwnj;గా &nbsp;ఉమ్మడి జిల్లాలను పరిగణిస్తారు. &nbsp;డిసిప్లినరీ/ACB కేసులు ఉన్నవారికి అర్హత లేదు. No Dues Certificate తప్పనిసరి. మెరిట్ ర్యాంక్ ఆధారంగా సీనియారిటీ లిస్టులు తయారు చేస్తారు.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <p>ట్రాన్స్&zwnj;ఫర్&zwnj;లు క్లియర్ వేకెన్సీ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. కొత్త జిల్లాలో చివరి ర్యాంక్ కేటాయింపు జరుగుతుంది. టై వచ్చినప్పుడు సీనియారిటీ మొదట, తర్వాత DOB (తేదీ ఆధారంగా) ప్రాధాన్యత పొందుతాయి. మెడికల్ గ్రౌండ్స్ (క్యాన్సర్, హార్ట్ డిసీజ్, న్యూరో-సర్జరీ, కిడ్నీ ట్రాన్స్&zwnj;ప్లాంటేషన్, బోన్ TB) ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. &nbsp;స్టేట్/డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ తప్పనిసరి.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;<br />&nbsp;<br />పూర్తి ప్రక్రియ ఆన్&zwnj;లైన్ పోర్టల్ ద్వారా జరుగుతుంది. అప్లై చేసిన తర్వాత ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు విడుదల అవుతుంది, ఆబ్జెక్షన్స్ స్వీకరణ తర్వాత ఫైనల్ లిస్టు తయారవుతుంది. శాఖా సెక్రటరీలు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్&zwnj;ఫర్ ఆర్డర్లు ఇస్తారు. మండల్/ULB అలాట్&zwnj;మెంట్ పోర్టల్&zwnj;లోనే జరుగుతుంది, తర్వాత కౌన్సిలింగ్&zwnj;లో సెక్రటేరియట్ అలాట్ &nbsp;చేస్తారు. ట్రాన్స్&zwnj;ఫర్ స్వయంకృత రిక్వెస్ట్ కావడంతో TTA/DA లేదు. పూర్తి ప్రక్రియ 30 నవంబర్ 2025 లోపు పూర్తి చేసుకోవాలి. జిల్లా కలెక్టర్లు, అపాయింటింగ్ అథారిటీలు వెకెన్సీలు ప్రకటించి, కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.&nbsp;&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/news/nitish-kumar-is-a-unique-leader-in-indian-politics-ten-key-facts-about-him-227332" width="631" height="381" scrolling="no"></iframe></p> <p>&nbsp;</p>
Read Entire Article