AP Liquor Scam Update: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నరెడ్డి సునీల్ రెడ్డి – ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు -ఆయనెవరంటే?

2 months ago 3
ARTICLE AD
<p>AP liquor scam Searches in &nbsp;Narreddy Sunil Reddy Houses: &nbsp;ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ &nbsp; మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడని పేరున్న &nbsp;నరెడ్డి సునీల్ రెడ్డికి చెందిన 10 కంపెనీలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్&zwnj;లోని బంజారా హిల్స్, కాటేదాన్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ వంటి &nbsp; ప్రాంతాల్లో సోదాలు &nbsp;నిర్వహిస్తోంది. &nbsp;షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్&zwnj;కు సంబంధించి సునీల్ రెడ్డి కీలంగా వ్యవహరించినట్లుగా అనుమానాలున్నాయి.&nbsp;</p> <p>నరెడ్డి సునీల్ రెడ్డి &nbsp;హైదరాబాద్&zwnj;లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూంటారు. &nbsp;కాంట్రాక్ట్ కంపెనీ కూడా ఉంది. &nbsp;ఆయన కంపెనీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక ప్రాజెక్టులు చేపట్టాయి. &nbsp;లిక్కర్ స్కామ్ విచారణలో ఆయన పేరు మొదటిసారి 2025 మార్చిలో లోక్&zwnj;సభలో తెలుగుదేశం పార్టీ &nbsp; ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు బయట పెట్టారు. &nbsp;ఆయనను జగన్ మోహన్ రెడ్డి 'బినామీ' అని వ్యాపార భాగస్వామి, &nbsp;మనీ లాండరర్&zwnj;గా ఆరోపించారు.&nbsp;</p> <p>&nbsp;సునీల్ రెడ్డి 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. &nbsp;సునీల్ రెడ్డికి చెందిన ఇన్&zwnj;ఫ్రా కంపెనీలు లిక్కర్ బిజినెస్&zwnj;తో ముడిపడి, షెల్ కంపెనీల రూపంలో డబ్బును దేశం బయటకు పంపడంలో కీలక పాత్ర పోషించాయని అనుమానాలున్నాయి. &nbsp;మార్చి 2025న లోక్ సభలో ఎంపీ లావు &nbsp;ఆయన ద్వారా రూ. 2,000 కోట్లు దుబాయ్&zwnj;కు మళ్లించారని &nbsp;ఆరోపించారు. &nbsp;ఆయన కంపెనీలు 2019-2024 మధ్య ఎన్నోమాటిక్&zwnj;గా ప్రారంభమై, ముగిసినట్లు ఆర్థిక రికార్డులు చూపిస్తున్నాయని ఆయన బయట పెటట్ారు. &nbsp;సునీల్ రెడ్డి జగన్ ఫ్యామిలీతో పాత సంబంధాలు ఉన్నాడని, ఆయనను '<a title="జగన్" href="https://telugu.abplive.com/topic/cm-jagan" data-type="interlinkingkeywords">జగన్</a> మనీ ట్రాన్స్&zwnj;పోర్టర్'గా <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a> నేతలు పిలుస్తున్నారు. &nbsp;</p> <p>ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ రూ. 3,500 కోట్ల స్కామ్&zwnj;గా భావిస్తున్నారు. &nbsp;వైసీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని మోనోపలీ చేసి, డిస్టిలరీల నుంచి కిక్&zwnj;బ్యాక్&zwnj;లు స్వీకరించి, డబ్బును షెల్ కంపెనీల ద్వారా దేశం బయటకు పంపిందని సిట్ ఆరోపణ. ఈ స్కామ్&zwnj;లో 12 మంది అరెస్టులు జరిగాయి, మరో 9 మంది పరారీలో ఉన్నారు. సునీల్ రెడ్డి ప్రధాన కార్యాలయంలో &nbsp;ఆఫీస్ రికార్డులు, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేశారు. షెల్ కంపెనీల రిజిస్ట్రేషన్ ఫైల్స్ సీజ్ చేశారు. &nbsp;రెసిడెన్షియల్, ఆఫీస్ ప్రాపర్టీలో తనిఖీలు చేశారు. మనీ ట్రాన్స్&zwnj;ఫర్ రికార్డులు, హవాలా లింకులు బహిర్గతమయ్యాయని సమాచారం. &nbsp;కార్యాలయాల్లో డాక్యుమెంట్స్, కంప్యూటర్లు స్కాన్ చేశారు. దుబాయ్ ట్రాన్స్&zwnj;ఫర్&zwnj;లకు సంబంధించిన ఈమెయిల్స్, బ్యాంక్ స్టేట్&zwnj;మెంట్స్ సేకరించారు.&nbsp;</p> <p>&nbsp;</p>
Read Entire Article