<p>AP liquor scam Searches in Narreddy Sunil Reddy Houses: ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడని పేరున్న నరెడ్డి సునీల్ రెడ్డికి చెందిన 10 కంపెనీలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్, కాటేదాన్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ వంటి ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్‌కు సంబంధించి సునీల్ రెడ్డి కీలంగా వ్యవహరించినట్లుగా అనుమానాలున్నాయి. </p>
<p>నరెడ్డి సునీల్ రెడ్డి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూంటారు. కాంట్రాక్ట్ కంపెనీ కూడా ఉంది. ఆయన కంపెనీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక ప్రాజెక్టులు చేపట్టాయి. లిక్కర్ స్కామ్ విచారణలో ఆయన పేరు మొదటిసారి 2025 మార్చిలో లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు బయట పెట్టారు. ఆయనను జగన్ మోహన్ రెడ్డి 'బినామీ' అని వ్యాపార భాగస్వామి, మనీ లాండరర్‌గా ఆరోపించారు. </p>
<p> సునీల్ రెడ్డి 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. సునీల్ రెడ్డికి చెందిన ఇన్‌ఫ్రా కంపెనీలు లిక్కర్ బిజినెస్‌తో ముడిపడి, షెల్ కంపెనీల రూపంలో డబ్బును దేశం బయటకు పంపడంలో కీలక పాత్ర పోషించాయని అనుమానాలున్నాయి. మార్చి 2025న లోక్ సభలో ఎంపీ లావు ఆయన ద్వారా రూ. 2,000 కోట్లు దుబాయ్‌కు మళ్లించారని ఆరోపించారు. ఆయన కంపెనీలు 2019-2024 మధ్య ఎన్నోమాటిక్‌గా ప్రారంభమై, ముగిసినట్లు ఆర్థిక రికార్డులు చూపిస్తున్నాయని ఆయన బయట పెటట్ారు. సునీల్ రెడ్డి జగన్ ఫ్యామిలీతో పాత సంబంధాలు ఉన్నాడని, ఆయనను '<a title="జగన్" href="https://telugu.abplive.com/topic/cm-jagan" data-type="interlinkingkeywords">జగన్</a> మనీ ట్రాన్స్‌పోర్టర్'గా <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a> నేతలు పిలుస్తున్నారు. </p>
<p>ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ రూ. 3,500 కోట్ల స్కామ్‌గా భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని మోనోపలీ చేసి, డిస్టిలరీల నుంచి కిక్‌బ్యాక్‌లు స్వీకరించి, డబ్బును షెల్ కంపెనీల ద్వారా దేశం బయటకు పంపిందని సిట్ ఆరోపణ. ఈ స్కామ్‌లో 12 మంది అరెస్టులు జరిగాయి, మరో 9 మంది పరారీలో ఉన్నారు. సునీల్ రెడ్డి ప్రధాన కార్యాలయంలో ఆఫీస్ రికార్డులు, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేశారు. షెల్ కంపెనీల రిజిస్ట్రేషన్ ఫైల్స్ సీజ్ చేశారు. రెసిడెన్షియల్, ఆఫీస్ ప్రాపర్టీలో తనిఖీలు చేశారు. మనీ ట్రాన్స్‌ఫర్ రికార్డులు, హవాలా లింకులు బహిర్గతమయ్యాయని సమాచారం. కార్యాలయాల్లో డాక్యుమెంట్స్, కంప్యూటర్లు స్కాన్ చేశారు. దుబాయ్ ట్రాన్స్‌ఫర్‌లకు సంబంధించిన ఈమెయిల్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ సేకరించారు. </p>
<p> </p>