<p>AP Gokulam Scheme | అమరావతి: ఏపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా గోకులాలను సంక్రాంతి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీ నుంచి 12 వరకు ఏపీ వ్యాప్తంగా గోకులాలకు సంక్రాంతి ప్రారంభించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయం తీసుకుంది. </p>
<p>ఈ మేరకు జనవరి 10వ తేదీన కాకినాడ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో నిర్వహించే కార్యక్రమానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారని అధికారులు తెలిపారు. ఇతర జిల్లాల్లోనూ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో గోకులాలను ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోకులాలను ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లాల కలెక్టర్లు, డ్వామా స్కీమ్ సంచాలకులకు పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ కృష్ణతేజ మంగళవారం (జనవరి 7న) ఉత్తర్వులు జారీ చేశారు. </p>
<p>ఉపాధి ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల కోసం ఏపీ ప్రభుత్వం గత ఏడాది అక్టోబరు 14వ తేదీ నుంచి 20 వరకు పల్లె పండగ- పంచాయతీ వారోత్స వాల పేరుతో గ్రామ సభలు నిర్వహించింది. ఆ గ్రామ సభలు గిన్నిస్ రికార్డ్ నెలకొల్పడం తెలిసిందే. తాజా నిర్ణయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో బాగంగా పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లకు షెల్టర్ల కోసం రాయితీలపై రైతులతో గోకులాలను నిర్మించ తలపెట్టింది కూటమి ప్రభుత్వం. </p>