AP Crime News: రాహుల్​ను హత్య చేయించింది పెద్దిరెడ్డి, మిథున్​ రెడ్డే- కోగంటి, విజయ్​కుమార్​ ఆరోపణలు

9 months ago 7
ARTICLE AD
<p>Karanam Rahul Murder Case: ఏపీలో సంచలనం సృష్టించిన, 2021లో జరిగిన పారిశ్రామికవేత్త కరణం రాహుల్&zwnj; హత్య కేసులో సూత్రధారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్&zwnj;రెడ్డి అని పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్&zwnj; కోరాడ విజయ్&zwnj;కుమార్&zwnj; ఆరోపించారు. హత్య చేయించింది తలశిల రఘురామ్&zwnj;, వెలంపల్లి శ్రీనివాస్&zwnj; అని సంచలన ఆరోపణలు చేశారు. శనివారం విజయవాడ కృష్ణలంకలో సత్యనారాయణ, విజయ్​కుమార్​ మీడియాతో మాట్లాడారు. ఆ కేసులో తాము నిర్దోషులమని, తమను కావాలనే ఇరికించారని అన్నారు.&nbsp;</p> <p><strong>గొడవల కారణంగానే హత్య</strong></p> <p>ఆ ఇద్దరు మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి మిధున్&zwnj;రెడ్డితో కలసి ఫ్యాక్టరీ నిర్మాణానికి రాహుల్&zwnj; రూ.40 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ఈ హత్య జరగడానికి ముందు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి దగ్గర ఆ రూ.40 కోట్లు తీసుకున్నారని చెప్పారు. ఈ ఒప్పందంలో గొడవల కారణంగానే హత్య జరిగిందని పేర్కొన్నారు. హత్య డైరెక్షన్ మొత్తం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిదేనని.. పాల్గొన్నది, చేయించింది తలశిల రఘురామ్, వెల్లంపల్లి శ్రీనివాస్ అని ఆరోపించారు. ఈ సమాచారం సేకరించేందుకు తమకు చాలా సమయం పట్టిందన్నారు. ఈ హత్య చేసింది తాము కాదని నాటి సీఎం <a title="జగన్" href="https://telugu.abplive.com/topic/cm-jagan" data-type="interlinkingkeywords">జగన్</a>&zwnj;కు, హోంమంత్రికి వినతిపత్రాలు ఇచ్చామని గుర్తుచేశారు. హత్యలో పాల్గొన్నవారిని మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నాని పేర్కొన్నారు. తమ ప్రాణాలకు హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.</p> <p>ఈ ఇన్వెస్టిగేషన్ మార్చాలని సత్యనారాయణ, విజయ్​కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. రాహుల్&zwnj; తండ్రి సైతం కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో రిట్&zwnj; వేశారని, కేసును సీఐడీకి గానీ, సీబీఐకి గానీ ఇచ్చి పునర్విచారణకు ఆదేశించాలని కోరారు. పోలీసులు తమపై థర్డ్&zwnj; డిగ్రీ ప్రయోగించి ఆ వీడియోను ఆనాటి మంత్రులకు పంపారని ఆరోపించారు. తాము జైలు నుంచి వచ్చేసరికి ఈ కేసులోని వాస్తవాలను వైసీపీ నేతలు మాయం చేశారని ఆరోపించారు. వైసీపీ నేతలకు, ఆనాటి విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులుకు మధ్య జరిగిన ఫోన్&zwnj; సంభాషణలను బయటకు తీస్తే నిజానిజాలు నిగ్గుతేలుతాయన్నారు. కేసు కోర్టు లో ఉంది కాబట్టి తాము ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని, ఈ కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ తో పాటు ఈడీ, ఇన్​కమ్​ టాక్స్ కూడా ఇన్వెస్టిగేషన్ జరపాలని.. అప్పుడే రాహుల్ అతని తండ్రి ఆర్థిక పరిస్థితి తెలుస్తుందన్నారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సిన అవసరం ఉందన్నారు.</p> <p><strong>ఛార్జర్&zwnj; వైరుతో గొంతు నులిమి హత్య</strong></p> <p>ఒంగోలు జడ్పీ కాలనీకి చెందిన కరణం రాహుల్&zwnj; (30) కెనడాలో ఎంఎస్&zwnj; పూర్తిచేసి, కొన్నాళ్లు అక్కడే ఉద్యోగం చేశారు. తిరిగొచ్చి విజయవాడకు మకాం మర్చారు. గతంలో తమ కుటుంబానికి పరిచయం ఉన్న కోరాడ విజయకుమార్&zwnj;తో పాటు, బొబ్బా రాహుల్&zwnj; చౌదరి, బొబ్బా వెంకటేశ్వరరావులతో కలిసి కృష్ణా జిల్లా జి.కొండూరులో జిక్సిన్&zwnj; సిలిండర్స్&zwnj; పేరుతో కంపెనీ ఏర్పాటుచేశారు. ఇందులో రాహుల్&zwnj;, కోరాడ, స్వామికిరణ్&zwnj;, బొబ్బా రాహుల్&zwnj; చౌదరి, అతడి తండ్రి వెంకటేశ్వరరావు కలిపి రూ.36 కోట్ల పెట్టుబడి పెట్టారు. దీనికి రాహుల్&zwnj; ఎండీగా ఉన్నారు. ఆ తర్వాత వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో భాగస్వాముల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే 2021 ఆగస్టు 18న రాహుల్​ కారులో ఉన్న ఛార్జర్&zwnj; వైరుతో గొంతు నులిమి హతమార్చారు. పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన ఈ హత్యలో 14 మంది పాల్గొన్నారని విజయవాడ పోలీసులు తేల్చారు. ఈ కేసులో కోగంటి సత్యనారాయణ, విజయకుమార్&zwnj; తోపాటు అనంత్&zwnj; సత్యనారాయణ, జానీ, కోటి, బాబు, రవికాంత్&zwnj; తదితరులను అరెస్ట్​ చేశారు.</p> <p>Also Read:&nbsp;<a href="https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/despite-being-a-senior-leader-in-tdp-not-given-a-ministerial-post-to-me-says-gorantla-butchaih-chowdary-199557" target="_blank" rel="noopener">Gorantla Butchaih Chowdary: టీడీపీలో సీనియర్, ఎన్టీఆర్&zwnj;కు భక్తుడిని.. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి</a></p>
Read Entire Article