<p><strong>Andhra Pradesh TET 2025: </strong>ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ 2025లో ఉద్యోగాలు సాధించలేకపోయిన వారికి మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. అమరావతిలో నిర్వహించిన మెగా డీఎస్సీ ఉద్యోగ పత్రాల పంపిణీ కార్యక్రమంలో కీలక ప్రకటన చేశారు. నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ ఇస్తున్నామని వెల్లడించారు. వచ్చే ఏడాది మరో డీఎస్సీ నోటిఫికేషన్ రాబోతోందని చెప్పారు. </p>
<h3>ఉత్తమ ఉపాధ్యాయులకు విదేశాలకు టూర్‌ </h3>
<p>రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులకు విదేశ విద్యపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు లోకేష్. అందుకే ఇలా ఉత్తమ ఉపాధ్యాయులకు బెస్ట్ ఎడ్యుకేషన్ అందిస్తున్న దేశాలకు టూర్‌లకు పంపించి అక్కడి విధానాలు తెలుసుకునే ఛాన్స్ కల్పించాలని ఆకాంక్షించారు. దీనికి ముఖ్యమంత్రి అనుమతి ఇవ్వాలని రిక్వస్ట్ చేశారు. దీని వల్ల దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్ అవలంభిస్తారని అన్నారు. </p>