Andhra Pradesh Budget 2025: పల్లెలకు ప్రగతి వెలుగులు ఇచ్చి అభివృద్ధి దారులు వేస్తున్నాం: బడ్జెట్‌లో కేశవ్

9 months ago 7
ARTICLE AD
<p><strong>Andhra Pradesh Budget 2025:&nbsp;</strong>గ్రామాలు శక్తి సంవన్నమై స్వయం సమృద్ధి సాధికారతలతో తులతూగకపోతే దేశాభివృద్ధి అసంపూర్తిగానే ఉండిపోతుందన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ కామెంట్స్&zwnj;ను గుర్తు చేసుకున్న పయ్యావుల... గ్రామీణ ప్రాంతాల అవసరాలను తీర్చాల్సిన బాధ్యతను గత ప్రభుత్వం విస్మరించిందన్నారు. ప్రజల హక్కు అయిన రహదారులు, తాగునీరు వంటి కనీస అవసరాలపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదని విమర్శించారు. స్థానిక సంస్థల నిధులను పక్క దారి పట్టించడంతో రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని వాపోయారు. ఉపముఖ్యమంత్రి వవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగువరచాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. ప్రజల చురుకైన భాగస్వామ్యంతో సమగ్ర గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించినట్టు తెలిపారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, పశువుల పాకలు తదితర 30 వేల పనులను మంజూరు చేసినట్టు వెల్లడించారు. &nbsp;</p> <p>"4,300 కిలోమీటర్ల మేరకు మంజూరైన సి.సి. రోడ్లలో, ఇప్పటికే 3 వేల కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తయ్యాయి. మరో 1,300 కి.మీ. మేర రోడ్ల నిర్మాణం తుది దశలో ఉన్నాయి. వీటి ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడి, ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి కల్పన జరిగింది." అని పయ్యావుల తెలిపారు. &nbsp;</p> <p>గత ప్రభుత్వం ఐదేళ్లుగా స్మార్ట్ ఎల్.ఇ.డి. వీధి దీపాల కార్యక్రమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు పయ్యావుల. 150 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించి కార్యక్రమాన్ని పునరుద్దరించినట్టు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఆగస్టు 15, 2019లో ప్రారంభించినప్పటి నుంచి 2024-25 వరకు 13,499 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటాను సకాలంలో విడుదల చేయకపోవడం వలన కేవలం 2,255 కోట్ల రూపాయలను మాత్రమే వినియోగించుకోగలిగారని తెలిపారు. ఛత్తీస్&zwnj;గఢ్&zwnj;, జార్ఖండ్, గుజరాత్, ఒడిశా వంటి రాష్ట్రాలు 2023-24 సంవత్సరానికి కేంద్రం నుంచి ఏపీ కంటే ఎక్కువ నిధులను వినియోగించుకున్నాయని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి చొరవ తీసుకుందని తమ అభ్యర్ధన మేరకు ఈ పథకం గడువును 2028 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దీనిలో భాగంగా 95.44 లక్షల గ్రామీణ గృహాలకు తాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. &nbsp;</p> <p>మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 45.30 లక్షల కుటుంబాలకు చెందిన 72 లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు పయ్యావుల. రైతులకు మేలు చేకూరేలా పొలాలకు అనుసంధాన రహదారులు వేస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో స్వచ్ఛభారత్ మిషన్ కింద వ్యర్థాల నిర్వహణ కార్యకలాపాలు చేపట్టా పరిశుభ్రమైన, ఆదర్శ గ్రామాలుగా తయారు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వనతులు, రోడ్ల నిర్మాణం విషయంలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. ఎక్కడ చూసినా.. గుంతలమయమైన రోడ్లే ఉండేవన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పి.ఎం.జి.ఎన్.వై.), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు, జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) నిధుల కింద రోడ్లు అభివృద్ధి చేసే ప్రయత్నాలు ప్రారంభించమన్నారు. అన్ని వాతావరణ వరిస్థితులను తట్టుకోగలిగే రహదారులను నిర్మించే దిశగా పి.ఎం.జన్ మన్ వథకం రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. &nbsp;అన్నింటికీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 18,847 కోట్ల రూపాయల కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. &nbsp;</p>
Read Entire Article