<p>Chandrababu in Assembly: 2047 నాటికి భారత్‌ జనాభా 162 కోట్లు దాటుతుందని ..2047 నాటికి చైనా జనాభా 100 కోట్లే ఉంటుందని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ మనందరి ఆకాంక్ష అని గుర్తు చేశారు. 2026 నాటికి ఏపీలో 5.37 కోట్ల మంది జనాభా ఉంటారని ఆరోగ్యం కాపాడుకోవడం అతి ముఖ్యమని సూచించారు. దక్షిణాదిలో జనాభా క్రమంగా తగ్గుతోందని యూపీ, బిహార్‌ వల్లే జనాభా బ్యాలెన్స్‌ అవుతుంద్నారు. ఏపీలో పీహెచ్‌సీల సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువ ఉన్నాయన్నారు. డబ్య్లూహెచ్‌వో (WHO) ప్రకారం మెడికల్‌ ఆఫీసర్లు మనదగ్గరే ఎక్కువ అని.. ఏపీలో ప్రస్తుతం 1.15 లక్షలమంది వైద్యులు ఉన్నారని తెలిపారు. <br /> <br />ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు 78 శాతం సాధించామని వెల్లడించారు. త్వరలో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో 100 శాతం సాధిస్తామని తెలిపారు. గర్భిణుల్లో అనీమియా 32 శాతం ఉందని తెలిపారు. సిజేరియన్‌లో 90 శాతం సిజేరియన్లు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని ఇలా జరగకూడదన్నారు. సహజ ప్రసవాలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వ విధానానికి విరుద్ధమని స్పష్టం చేశారు. "భగవంతుడు ఇచ్చిన సహజసిద్ధమైన శరీరాన్ని కోయడం మంచిది కాదు" అని హెచ్చరించారు, గర్భిణులకు యోగా, సురక్షిత ప్రసవాలపై అవగాహన కల్పించాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు సూచించారు. ప్రసంగంలో రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ బలాలు, లోపాలు, జనాభా ట్రెండ్స్, భవిష్యత్ ప్రణాళికలు వివరంగా చర్చించారు. </p>
<p>"ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలనేది మనందరి ఆకాంక్ష" అని చెప్పిన సీఎం, అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గుతున్న సందర్భంగా, ఆరోగ్య సేవలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంద్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పాల్గొన్న చర్చలో <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> ప్రసంగం TDP ప్రభుత్వ ఆరోగ్య విధానాలకు మార్గదర్శకంగా మారింది. ఈ ప్రసంగం ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణలు పెంచే అవకాశాన్ని సూచిస్తోంది. రాష్ట్రంలో ఆరోగ్య సేవల మెరుగుదలకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ప్రభుత్వం స్పష్టం చేసినట్లయింది. </p>