<p><strong>Andaman and Nicobar Islands Name Change: </strong>అండమాన్ నికోబార్ దీవుల పేరు మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ దీవులకు ఆజాద్ హింద్ దీవులుగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. బ్రిటీష్ కాలం నాటి పేర్లను కొనసాగించడం అంటే ఇంకా బానిసత్వ చిహ్నాలను మోయడమేనని కవిత తన లేఖలో పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ చిరకాల డిమాండ్‌కు మద్దతు తెలపడం ద్వారా, జాతీయస్థాయిలో తెలంగాణ జాగృతి గొంతుకను వినిపించాలని ఆమె భావిస్తున్నారు. అండమాన్ అనే పేరు బ్రిటిష్ నావికుల ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిందని, దానికి బదులుగా నేతాజీ ఆశయాలకు ప్రతీకగా ఆజాద్ హింద్ అని పేరు పెట్టడమే భారతీయ వీరుడికి ఇచ్చే నిజమైన గౌరవమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ నెల 26న 'X' వేదికగా జరగబోయే డిజిటల్ ఉద్యమం ద్వారా ఈ డిమాండ్‌ను దేశవ్యాప్తం చేయాలన్నది ఆమె వ్యూహం.<br /> <br />అండమాన్ దీవుల పేరు మార్చాలనే డిమాండ్ నిన్న మొన్నటిది కాదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సహకారంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్ దీవులను ఆక్రమించినప్పుడు, ఆయనే స్వయంగా వీటికి షహీద్, స్వరాజ్ అని పేర్లు పెట్టారు. ఆనాటి నుంచి నేతాజీ అభిమానులు ఈ పేర్లను అధికారికం చేయాలని కోరుతూనే ఉన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఈ దీవుల పేరును ఆజాద్ హింద్ గా మార్చాలని పార్లమెంటు లోపల, వెలుపల అనేకసార్లు పోరాటం చేసింది.</p>
<p>ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 2018లో అండమాన్‌లోని మూడు ప్రధాన దీవుల రాస్ ఐలాండ్, నీల్ ఐలాండ్, హావ్ లాక్ ఐలాండ్ పేర్లను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం, షహీద్ ద్వీపం, స్వరాజ్ ద్వీపంగా మార్చింది. అయితే, మొత్తం ఆర్చిపెలాగో దీవుల సముదాయం పేరును మార్చాలన్నది ఇప్పుడు కవిత లేఖలో ప్రధానంగా ప్రస్తావించిన అంశం. </p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en">Netaji Subhas Chandra Bose gave us the dream of <a href="https://twitter.com/hashtag/AzadHind?src=hash&ref_src=twsrc%5Etfw">#AzadHind</a>. On <a href="https://twitter.com/hashtag/ParakramDiwas?src=hash&ref_src=twsrc%5Etfw">#ParakramDiwas</a>, I urge PM <a href="https://twitter.com/narendramodi?ref_src=twsrc%5Etfw">@narendramodi</a> ji to rename the Andaman & Nicobar Islands as ‘Azad Hind’ as a true tribute to our national pride.<a href="https://twitter.com/hashtag/AzadHind?src=hash&ref_src=twsrc%5Etfw">#AzadHind</a> <a href="https://twitter.com/hashtag/JaiHind?src=hash&ref_src=twsrc%5Etfw">#JaiHind</a> <a href="https://t.co/1kaUuuRjmY">pic.twitter.com/1kaUuuRjmY</a></p>
— Kavitha Kalvakuntla (@RaoKavitha) <a href="https://twitter.com/RaoKavitha/status/2014641433446318244?ref_src=twsrc%5Etfw">January 23, 2026</a></blockquote>
<p>
<script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script>
<br />లక్ష్యశుద్ధి, చిత్తశుద్ధి ఉన్న నాయకులంతా నేతాజీని స్ఫూర్తిగా తీసుకోవాలని కవిత కోరడం వెనుక బలమైన రాజకీయ సందేశం కనిపిస్తోంది. దేశ భద్రత, జాతీయ సమగ్రత విషయంలో నేతాజీ చూపిన మార్గం నేటి తరానికి అవసరమని ఆమె గుర్తు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్ బలపడేలా ఉద్యమిస్తామని చెప్పడం ద్వారా, ప్రాంతీయ అంశాలతో పాటు జాతీయ స్థాయి ప్రాధాన్యత ఉన్న చారిత్రక అంశాలపై కూడా తెలంగాణ జాగృతి దృష్టి సారిస్తోందని స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ లేఖపై ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.<br /> </p>
<p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/health/celebrities-choice-black-water-do-you-know-what-happens-if-you-drink-it-235389" width="631" height="381" scrolling="no"></iframe></p>