Ambati Rambabu Arrest: అంబటి రాంబాబు ఇంటికి పోలీసులు, ఏ క్షణంలోనైనా అరెస్టు చేేసే అవకాశం

2 months ago 9
ARTICLE AD
<p data-path-to-node="2">అమరావతిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓవైపు చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని టీడీపీ సహా కూటమి శ్రేణులు డిమాండ్ చేస్తుండగా మరోవైపు పలు పోలీస్ స్టేషన్లలో అంబటి రాంబాబుపై కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు మరికాసేపట్లో అంబటి రాంబాబును అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.</p> <p data-path-to-node="4,0,0">&nbsp;అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అరెస్ట్ చేసి తరలించేందుకు వీలుగా ఒక ప్రత్యేక వాహనాన్ని కూడా సిద్ధం చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్&zwnj;లో అంబటిపై ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగానే పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ అనంతరం ఆయనను నేరుగా నల్లపాడు పోలీస్ స్టేషన్&zwnj;కు తరలించే అవకాశం ఉందని సమాచారం. పోలీసుల రాకతో అంబటి మద్దతుదారులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు, దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.</p> <p data-path-to-node="4,0,0"><strong>పిల్లి మాణిక్యాలరావు ఫిర్యాదుతో కేసు నమోదు</strong></p> <p data-path-to-node="2">మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఉచ్చు బిగుస్తోంది. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అంబటిపై ఫిర్యాదు చేసిన పిల్లి మాణిక్యాలరావు స్టేట్&zwnj;మెంట్&zwnj;ను పోలీసులు అధికారికంగా రికార్డ్ చేశారు.ఇప్పటివరకు అంబటి రాంబాబుపై రెండు కేసులు (నల్లపాడు పోలీస్ స్టేషన్&zwnj;లో) నమోదయ్యాయి. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ క్రింది ప్రాంతాలలో ఫిర్యాదులు అందాయి:</p> <p data-path-to-node="4,2,1,0,0">తాడికొండ, దాచేపల్లి, పట్టాభిపురం, పత్తిపాడు, నల్లపాడు పోలీస్ స్టేషన్లలో వరుస ఫిర్యాదులతో కేసులు నమోదవుతున్నాయి.&nbsp;ప్రస్తుతానికి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేయడంతో, ఈ ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఫిర్యాదులను జతచేసి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.</p> <p data-path-to-node="4,2,1,0,0"><strong>అసలేం జరిగిందంటే..</strong><br />తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వులేదని, కూటమి నేతలు అపచారం చేశారంటూ వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పాప ప్రక్షాళన పేరుతో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పలు చోట్ల ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలో గుంటూరులో జరిగిన ఆందోళనలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయి బూతులు మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబును సైతం కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అంబటి ఇంటిపై దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.&nbsp;</p>
Read Entire Article