Ainavilli News Today:ఆ పెన్నుతో పరీక్ష రాస్తే పాస్ గ్యారెంటీ- తల్లిదండ్రులు, విద్యార్థుల నమ్మకానికి కారణమేంటీ!

10 months ago 7
ARTICLE AD
<p><strong>Ainavilli News Today:&nbsp;</strong>పరీక్షలు వచ్చాయంటే విద్యార్థుల టెన్షన్ ఒక ఎత్తైతే. తల్లిదండ్రుల టెన్షన్&zwnj; మరో ఎత్తు. అయితే కొందరు తల్లిదండ్రులు, విద్యార్థులు మాత్రం ఓ పెన్ను కోసం ఎదురు చూస్తా ఉంటారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన పెన్నుతో పరీక్షలు రాస్తే పాస్ గ్యారెంటీ అంటూ చెబుతుంటారు. ఎక్కడెక్కడి వాళ్లో ఇక్కడి పెన్నులను ప్రత్యేకంగా పోస్టల్, ఇతర మార్గాల ద్వారా తెప్పించుకుంటారు. అందుకే ప్రతి శ్రీపంచమి నుంచి మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలోని ఆలయంలో పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. ఆ ఆలయం పేరే అయినవిల్లి.&nbsp;</p> <p>ఆంధ్రప్రదేశ్&zwnj;లో కాణిపాకం విఘ్నేశ్వర ఆలయం తర్వాత అంతటి ఫేమస్ అయిన వినాయకుడి గుడి అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం. కోనసీమ జిల్లాలో కొలువై ఉన్న అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేకంగా పూజలు చేసిన పెన్నులు తీసుకొని పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు వస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే ేటా లక్షల్లో పెన్నులు ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు పంపిస్తారు.&nbsp;</p> <p>విద్యను ప్రసాదించే ఆదిగణపతిగా కొలువైన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఏటా శ్రీపంచమి రోజున వేడుక చేస్తారు. ఈ వేడుక మూడు రోజుల పాటు జరుగుతుంది. అనంతరం అక్కడ పూజలు చేసిన పెన్నులను మరో మంచి రోజు చూసుకొని పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా చేపడతారు. శ్రీ పంచమిని పురస్కరించుకుని సప్త నదీ జలాలతో రుద్రాభిషేకం, సరస్వతి పూజ అనంతరం విఘ్నేశ్వరుని సన్నిధిలో కలములు ఉంచి పూజలు చేస్తారు. వాటిని విద్యార్థులకు పంపించడం ఆనవాయితీగా జరుగుతోంది.&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/andhra-pradesh/andhra-pradesh-whatsapp-governance-number-and-service-details-196085" width="631" height="381" scrolling="no"></iframe></p> <p>12 ఏళ్ల నుంచి ఈ ప్రక్రియను నిర్విఘ్నంగా సాగుతోంది. గణనాథుని సన్నిధిలో పూజలు చేసిన కలములతో పరీక్షలు రాస్తే విజయం సిద్ధిస్తుందని విశ్వాసంతో సుమారు లక్ష పెన్నులు తీసుకెళ్తారు. దూర ప్రాంతాల్లో ఉన్న భక్తుల కోరిక మేరకు పోస్టల్&zwnj;, కొరియర్&zwnj; ద్వారా పంపిస్తారు. &nbsp;</p> <p><strong>12 ఏళ్లుగా సంప్రదాయం..</strong><br />పెన్నుల పండుగా పిలుచుకునే ఈ కార్యక్రమం కోసం ఏటా విద్యార్థులు ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. 2012లో తొలిసారిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో పరీక్షలు రాసే విద్యార్థులు కోసం వారి తల్లిదండ్రులు ఎంతో ఇష్టంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ఈ పెన్నులు తీసుకెళ్తుంటారు. స్థానికంగా పంపిణీ చేసే పెన్నులు పూర్తిగా ఉచితం కాగా దూర ప్రాంతాలకు పోస్టల్&zwnj; ద్వారా పంపించేందుకు నిర్ణీత రుసుము వసూళ్లు చేస్తున్నారు.&nbsp;</p> <p><strong>మూడు రోజుల పాటు ఉత్సవం...</strong><br />మాఘ శుద్ధ చవితిని పురస్కరించుకుని ప్రారంభమయ్యే ఈ ఉత్సవంలో విఘ్నేశ్వరునికి సప్తనదీ జలాలలో రుద్రాభిషేకం నిర్వహిస్తారు. మరుసటి రోజు మాఘ శుద్ధ శ్రీపంచమి సందర్భంగా సరస్వతీ పూజ చేస్తారు. మరుసటి రోజు పూర్ణాహుతి చేపట్టి అదేరోజు లక్షలాది పెన్నులు స్వామి సన్నిధిలో కుమ్మరించి ఆపై ప్రత్యేక పూజలు చేస్తారు. తరువాత ఆలయం వద్ద పెన్నుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రూ.250 చెల్లించిన వారికి గోత్రనామాలతో సప్తనదీ జలాలతో అభిషేకం జరిపించి పది కలములు వారికి అందిస్తారు. దూర ప్రాంతాల నుంచి ఆర్డర్&zwnj; పెట్టిన విద్యార్థుల కోసం పార్సిల్&zwnj;లో పంపిస్తారు.&nbsp;</p> <p><strong>Also Read: <a title="ఫిబ్రవరి 20న తెలంగాణ ఎప్&zwnj;సెట్ నోటిఫికేషన్ వెల్లడి, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?" href="https://telugu.abplive.com/education/telangana-eapcet-2025-application-process-will-be-starts-from-25th-february-196823" target="_blank" rel="noopener">ఫిబ్రవరి 20న తెలంగాణ ఎప్&zwnj;సెట్ నోటిఫికేషన్ వెల్లడి, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?</a></strong></p>
Read Entire Article