AI Revolution: ఏఐతో రాబోయే ఐదేళ్లలో 40 లక్షల కొత్త ఉద్యోగాలు – నితీ ఆయోగ్ కీలక ప్రకటన

1 month ago 2
ARTICLE AD
<p><strong>AI Revolution:</strong> ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో పెను మార్పులు తీసుకువస్తున్న కృత్రిమ మేధస్సు, భారతదేశంలో ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తుందనే భయాలు ఉన్నాయి. దీన్ని పటాపంచలు చేస్తూ, కేంద్ర ప్రభుత్వ థింక్ ట్యాంక్ అయిన నితీ ఆయోగ్ కీలక నివేదికను విడుదల చేసింది. రాబోయే ఐదేళ్లలో దేశంలోని సాంకేతిక, కస్టమర్-ఎక్స్&zwnj;పీరియన్స్&zwnj; రంగాల్లో 40 లక్షల వరకు కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఆటోమేషన్ కారణంగా కొన్ని రొటీన్ పనులు కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ, AI మొత్తం ప్రభావం ఉద్యోగ కల్పన వైపు మొగ్గు చూపుతుందని నితీ ఆయోగ్ అంచనా వేసింది.</p> <p>నితీ ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఆవిష్కరించిన ఈ లేటెస్ట్ నివేదిక "AI ఎకానమీలో ఉద్యోగ సృష్టికి రోడ్&zwnj;మ్యాప్"&nbsp; &nbsp;కృత్రిమ మేధస్సు పనితీరు, కార్మికులు, మొత్తం శ్రామిక శక్తి రూపాన్ని ఎలా మారుస్తుందో నొక్కి చెప్పింది. టెక్ సర్వీస్&zwnj;లో AI రెండింతల ప్రభావాన్ని చూపుతుంది. కొత్త అవకాశాలను కూడా ఇస్తుంది. అదే టైంలో సవాళ్లను కూడా విసురుతుంది. అందుకే విప్లవాన్ని అవకాశంగా మలుచుకునేందుకు కేంద్రం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నితీ ఆయోగ్ సూచించింది.</p> <h3>తక్షణ కార్యాచరణ అవసరం</h3> <p>భారతదేశం ప్రస్తుతం సంధికాలంలో ఉందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. ఉద్యోగ మార్కెట్&zwnj;పై AI చూపే ప్రభావాన్ని వెంటనే పరిగణనలోకి తీసుకొని కార్యాచరణ రూపొందించాలని సూచించింది. AI పూర్తి సామర్థ్యాన్ని యూజ్ చేసుకోవడానికి 'సాహసోపేతమైన, వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక' అవసరాన్ని నొక్కి చెప్పింది.&nbsp;</p> <p>నితీ ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రజలే దేానికి బలమని పేర్కొన్నారు. "90 లక్షలకుపైగా టెక్నాలజీ, కస్టమర్ ఎక్స్&zwnj;పీరియన్స్&zwnj; నిపుణులు, ప్రపంచంలోనే అతిపెద్ద యువ డిజిటల్ ప్రతిభావంతుల సమూహం కలిగి ఉంది. స్థాయి, ఆశయం రెండూ ఉన్నాయి. ఇప్పుడు కావాల్సింది విజన్ అండ్ కోఆర్డినేన్" అని ఆయన గట్టిగా చెప్పారు. &nbsp;</p> <h3>'నేషనల్ AI టాలెంట్ మిషన్': ఇండియాను గ్లోబల్ హబ్&zwnj;గా మార్చడమే లక్ష్యం</h3> <p>ఈ విప్లవాన్ని ఒక అద్భుత అవకాశంగా మార్చుకోవడానికి, నితీ ఆయోగ్ ఒక కీలకమైన నేషనల్ AI టాలెంట్ మిషన్ ప్రతిపాదించింది. భారతదేశాన్ని AI నైపుణ్యాలు, సామర్థ్యాల కేంద్రంగా మార్చడమే ఈ మిషన్ అంతిమ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి నితీ ఆయోగ్ ఒక మూడు కీలక వ్యూహాలను సూచించింది. &nbsp;</p> <p><strong>1. విద్యలో AI పొందుపరచడం:</strong> పాఠశాల, ఉన్నత విద్య స్థాయులలో AI &nbsp;బేసిక్స్&zwnj;, అవగాహనను అందించడం, తద్వారా విద్యార్థులు రేపటికి సిద్ధమవుతారు. &nbsp;</p> <p><strong>2. జాతీయ నైపుణ్యాలను పెంపొందించే ఇంజిన్&zwnj; సృష్టి :</strong> ఇప్పటికే పని చేస్తున్న వృత్తి నిపుణులకు AI నైపుణ్యాలను నేర్పడం ద్వారా, ప్రమాదంలో ఉన్న వారికి పాత్రలోకి మారే వీలు కలుగుతుంది. &nbsp;</p> <p><strong>3. AI ప్రతిభను ఆకర్షించే కేంద్రంగా దేశాన్ని మార్చడం:</strong> అంతర్జాతీయ సంస్థలు, నిపుణులను &nbsp;దేశంలోకి ఆహ్వానించేందుకు వారికి అవసరమైన మౌలిక వసతులు, భాగస్వామ్యాలను కల్పించాలి.&nbsp;</p> <p>ఈ మూడు నిర్ణయాలతో భారతదేశం కేవలం ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా, ప్రపంచ AI పటంపై తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.</p>
Read Entire Article