AI Data Center in Vizag: విశాఖలో గూగుల్‌ అనుబంధ సంస్థ ఏఐ డేటా సెంటర్, రూ.87 వేల కోట్ల పెట్టుబడులు

2 months ago 3
ARTICLE AD
<p>AI Data Center in Vizag: విశాఖపట్నం: సాగర తీర నగరం విశాఖలో ఇదివరకే ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్&zwnj;ను గూగుల్ ఏర్పాటు చేయబోతుంది. రూ.16 వేల కోట్లతో సిఫీ సంస్థ డేటా సెంటర్ కాంప్లెక్స్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో అనుమతి తీసుకుంది. తాజాగా విశాఖపట్నం నగరానికి మరో ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ రాబోతోంది. గూగుల్&zwnj; అనుబంధ సంస్థ రైడెన్&zwnj; ఇన్ఫోటెక్&zwnj; ఇండియా ప్రైవేట్&zwnj; లిమిటెడ్&zwnj; ఏఐ పవర్&zwnj; డేటా సెంటర్&zwnj;ను విశాఖలో ఏర్పాటు చేయాలని ఆసక్తి చూపింది. దాని ద్వారా ఏఐ టెక్నాలజీతో విశాఖలో వేలాది కొత్త ఉద్యోగాలు రానున్నాయి.</p> <p><strong>ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన సంస్థ</strong></p> <p>1,000 మెగావాట్ల &nbsp;డేటా సెంటర్ కోసం రైడెన్ సంస్థ రూ.87,250 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. వచ్చే &nbsp;రెండున్నరేళ్లలో మొదటి దశ యూనిట్&zwnj;ను పూర్తి చేయాలని సంస్థ తమ ప్రతిపాదనల్ని ఏపీ ప్రభుత్వానికి పంపింది. గూగుల్&zwnj; సంస్థ కూడా విశాఖపట్నంలో రూ.52 వేల కోట్లతో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్&zwnj;ను ఏర్పాటు చేయనుంది. సిఫీ సంస్థ డేటా సెంటర్&zwnj; కాంప్లెక్స్&zwnj;కు నిర్ణయం తీసుకుంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ సైతం విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంతో ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరుపుతోంది. అందుకు సంబంధించి స్థలం, అనుమతలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.</p> <p><strong>రైడెన్&zwnj; సంస్థ ప్రతిపాదించిన స్థలాలు</strong><br />రైడెన్&zwnj; ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవెట్ లిమిటెడ్ సంస్థ &nbsp;విశాఖపట్నం జిల్లాలో 3 చోట్ల డేటా సెంటర్లను ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఇందుకోసం తర్లువాడలో 200 ఎకరాలు, రాంబిల్లి అచ్యుతాపురం క్లస్టర్&zwnj;లో 160 ఎకరాలు, అడవివరంలో 120 ఎకరాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించి, రెండున్నరేళ్లలో మొదటి దశ పనులు పూర్తిచేయనుంది. &nbsp;రైడెన్&zwnj; సంస్థ ప్రస్తావించింది. 2026 మార్చి నాటికి నిర్మాణాలు ప్రారంభించి, 2028 జులై నాటికి పనులు పూర్తిచేసి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రతిపాదనలు పంపింది.&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/amravati/these-are-the-special-features-of-the-ap-crda-building-222779" width="631" height="381" scrolling="no"></iframe></p> <p><strong>విద్యుత్&zwnj; అవసరం, నిధులు</strong><br />రైడెన్ సంస్థ ఏర్పాటు చేయనున్న 3 డేటా సెంటర్లకు దాదాపు 2,100 మెగావాట్ల విద్యుత్&zwnj; అవసరం. &nbsp;విద్యుత్&zwnj; సంస్థల నుండి తీసుకోవాలని సంస్థ భావిస్తోంది. తర్లువాడలో 929 మెగావాట్ల విద్యుత్, రాంబిల్లి డేటా సెంటర్&zwnj;కు 697 మెగావాట్ల విద్యుత్&zwnj;, అడవివరంలో 465 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని సంస్థ వెల్లడించింది.</p> <p><strong>గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్&zwnj;&nbsp;</strong><br />అమెరికాకు చెందిన గూగుల్&zwnj; ఎల్&zwnj;ఎల్&zwnj;సీకి అనుబంధ సంస్థగా రైడెన్&zwnj; ఏపీఏసీ ఇన్వెస్ట్&zwnj;మెంట్&zwnj; హోల్డింగ్&zwnj; కంపెనీ ఉంది. ఇది సింగపూర్&zwnj;కు చెందిన కంపెనీ. రైడెన్&zwnj; సంస్థ నాస్&zwnj;డాక్&zwnj; స్టాక్&zwnj; మార్కెట్&zwnj;లో పబ్లిక్&zwnj; లిమిటెడ్&zwnj; కంపెనీల జాబితాలో ఉన్నామని ఏపీ ప్రభుత్వానికి తెలిపింది.ఈ కంపెనీ రైడెన్&zwnj; ఇన్ఫోటెక్&zwnj; ఇండియా ప్రైవేట్&zwnj; లిమిటెడ్&zwnj; లో మెజారిటీ వాటాదారు. రైడెన్&zwnj; ఏపీఏసీ విశాఖలో ఏఐ డేటా సెంటర్&zwnj; కోసం నిధులు ఇవ్వనుంది.</p>
Read Entire Article