Afzalgunj firing: అఫ్జల్​గంజ్​లో కాల్పులకు పాల్పడ్డ దుండగులు ఎలా పారిపోయారంటే..?

10 months ago 8
ARTICLE AD
<p>అఫ్జల్&zwnj;గంజ్&zwnj; కొద్దిరోజుల క్రితం దుండగులు కాల్పులకు పాల్పడి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసులో పురోగతి సాధించారు. కీలక ఆధారాలు సేకరించారు. వారు ఎక్కడి నుంచి ఎటు పారిపోయారన్నది గుర్తించారు. కాల్పులకు పాల్పడిన దుండగులు అనంతరం తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్&zwnj;పేట్&zwnj; వరకు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడి నుంచి గజ్వేల్ వరకు షేరింగ్ ఆటోలో వెళ్లి అక్కడి నుంచి ఆదిలాబాద్&zwnj; వరకు లారీలో ప్రయాణించినట్లు తేల్చారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బిహార్&zwnj;కు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.&nbsp;</p> <p><strong>తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ పోలీసులపై కాల్పులు</strong><br />బీదర్​లో చోరీ.. అఫ్జల్​గంజ్​లో కాల్పులు.. కర్ణాటక బీదర్&zwnj;లోని ఓ ఏటీఎం సెంటర్​లో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఒకరిని కాల్చి చంపి వారి వద్ద ఉన్న రూ.93 లక్షలతో బైక్​పై అక్కడి నుంచి ఉడాయించారు. అక్కడి నుంచి హైదరాబాద్​లోని అఫ్జల్​గంజ్​కు వచ్చి తలదాచుకున్నారు. అయితే వారు ఇక్కడ ఉన్నట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు వారిని పట్టుకునేందుకు హైదరాబాద్​కు వచ్చారు. అయితే ఆ దుండగులు అప్జల్&zwnj;గంజ్&zwnj;లో <a title="కర్ణాటక" href="https://telugu.abplive.com/topic/Karnataka" data-type="interlinkingkeywords">కర్ణాటక</a> పోలీసులను పసిగట్టిన దుండగులు.. వారిని తప్పించుకునే క్రమంలో వారిపై కాల్పులు జరిపారు. అనంతరం ఓ ట్రావెల్స్&zwnj; కార్యాలయంలోకి వెళ్లిన దుండగులు కాల్పులు జరుపుతుండగా.. ట్రావెల్స్&zwnj; మేనేజర్&zwnj; కు గాయాలయ్యాయి.</p> <p><strong>బిహార్&zwnj;తో పాటు ఝార్ఖండ్&zwnj;లో గాలింపు</strong><br />కాగా ఆ ఇద్దరు నిందితులను అమిత్, మనీశ్&zwnj;గా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు బీదర్, హైదరాబాద్&zwnj; పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి జల్లెడ పడుతున్నారు. వారికోసం ఇప్పటికే పోలీసులు బిహార్&zwnj;తో పాటు ఝార్ఖండ్&zwnj;కు చేరుకొని అక్కడి పోలీసుల సహకారంతో విస్తృతంగా గాలిస్తున్నారు.</p>
Read Entire Article