ABP Network Ideas of India Summit 2025: ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ - ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు

9 months ago 8
ARTICLE AD
<p><strong>Ideas of India Summit 2025:</strong> న్యూఢిల్లీ : వాతావరణ మార్పుల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వరకూ భారతదేశం ఇప్పుడు ప్రపంచ్యాప్తంగా వస్తున్న అగ్రెసిసి జియోపాలిటిక్స్ మార్పులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో &nbsp;భారతదేశంలోని ప్రముఖ బహుళ భాషా వార్తా నెట్&zwnj;వర్క్ అయిన ABP నెట్&zwnj;వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025 &nbsp;నాల్గవ ఎడిషన్&zwnj;ను నిర్వహించనుంది. ఈ సమ్మిట్ ఫిబ్రవరి 21 , 22, 2025 తేదీలలో ముంబైలో జరగుతుంది.</p> <p>ఈ సారి ABP నెట్&zwnj;వర్క్ &nbsp;ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025 &nbsp; "మానవత్వం తదుపరి సరిహద్దు" ( Humanity&rsquo;s Next Frontier&rdquo; &nbsp;) అనే ధీమ్&zwnj;తో సమ్మిట్ నిర్వహిస్తోంది. &nbsp;ప్రపంచ అనిశ్చితుల మధ్య మానవ జ్ఞానం , &nbsp;ఆవిష్కరణల సరిహద్దులను నెట్టివేసే కొత్త ప్రపంచ క్రమంలో భారతదేశం &nbsp;పాత్రపై చర్చించడానికి ప్రముఖ మేధావులు, ఛేంజ్ మేకర్స్ పాల్గొంటారు. వీరు &nbsp;సైన్స్, AI, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి లో 'మంచి కోసం శక్తి'గా ఉద్భవించడానికి భారతదేశం తన శక్తిని, మ్యాన్ పవర్ ను.. &nbsp;సామాజిక-ఆర్థిక ప్రయోజనాలను ఉపయోగించుకునే మార్గాలను ఈ సమ్మిట్ అన్వేషిస్తుంది. &nbsp;ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్ లక్ష్యం. &nbsp;భవిష్యత్తు కోసం ఒక రోడ్&zwnj;మ్యాప్&zwnj;ను రూపొందించడం. అన్ని రంగాల నుంచి ప్రముఖులు, వక్తలు సమ్మిట్&zwnj;లో పాల్గొంటున్నారు.&nbsp;</p> <p>ABP నెట్&zwnj;వర్క్ యొక్క ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025 లో వివిధ రంగాల ప్రముఖులు తమ అభిప్రాయాలు, ఆలోచనలు వివరిస్తారు. &nbsp;మోటివేషనల్ స్పీకర్ ,లైఫ్&zwnj;స్టైల్ కోచ్ గౌర్ గోపాల్ దాస్ 21వ శతాబ్దంలో ఆధ్యాత్మిక పరిణామంలో ఉన్న నిగూఢ రహస్యాలను ఆవిష్కరిస్తారు &nbsp;అలాగే &nbsp;రచయిత, జర్నలిస్ట్ మరియు ట్రావెల్ రైటర్ పికో అయ్యర్ &nbsp;కొత్త ప్రయాణ , సాహిత్యాల్లో వస్తున్న మార్పులు, అభిరుచులపై చర్చిస్తారు. &nbsp;పెర్కషన్ వాద్యకారులు, తబలా వాద్యకారులు ఉస్తాద్ తౌఫిక్ ఖురేషి , బిక్రమ్ ఘోష్ సంగీతాన్ని స్వరపరిచి, బీట్&zwnj;లను వినిపిస్తారు. సైన్స్ , టెక్నాలజీ ప్రపంచం నుండి ప్రముఖులు నోబెల్ బహుమతి గ్రహీత జీవశాస్త్రవేత్త డాక్టర్ (ప్రొఫెసర్) వెంకి రామకృష్ణన్, NIMHANS డైరెక్టర్ డాక్టర్ ప్రతిమ మూర్తి, NASA-JPL సీనియర్ సైంటిస్ట్ మరియు కాల్టెక్ విజిటింగ్ ప్రొఫెసర్ డాక్టర్ గౌతమ్ చటోపాధ్యాయ, గూగుల్ డీప్&zwnj;మైండ్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ మనీష్ గుప్తా తో పాటు ఇతరులు ప్రపంచం శాస్త్రీయ ఆవిష్కరణలను దాటి చేస్తున్న అద్భుత పరిశోధనలపై చర్చిస్తారు.&nbsp;</p> <p>ఉక్రెయిన్ చర్చలు జరిపిన మాజీ అమెరికా ప్రత్యేక ప్రతినిధి రాయబారి కర్ట్ వోల్కర్, రచయిత, రాజకీయవేత్త, మాజీ అంతర్జాతీయ దౌత్యవేత్త డాక్టర్ శశి థరూర్, ఆర్&zwnj;పి-సంజీవ్ గోయెంకా గ్రూప్ వైస్ చైర్మన్ శశ్వత్ గోయెంకా, కిర్లోస్కర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్&zwnj;పర్సన్ &amp; ఎండీ గీతాంజలి విక్రమ్ కిర్లోస్కర్, నటి , క్లైమేట్ వారియర్ భూమి పెడ్నేకర్, సంగీత స్వరకర్త , మూడు సార్లు గ్రామీ అవార్డు గ్రహీత రికీ కేజ్, 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, ఆల్-ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ప్రకాష్ పదుకొనే, భారత ఒలింపిక్ పతక విజేత, గ్రాండ్&zwnj;స్లామ్ ఛాంపియన్ , అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమర్ లియాండర్ పేస్, 9 సార్లు బిలియర్డ్స్/స్నూకర్ ప్రపంచ ఛాంపియన్ గీత్ సేథి, చెఫ్ , మాస్టర్ చెఫ్ ఇండియా జడ్జి రణవీర్ బ్రార్, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత &nbsp; &nbsp;డాక్టర్ బెజ్వాడ విల్సన్, &nbsp;జాతీయ ప్రధాన కార్యదర్శి, INC సచిన్ పైలట్ , &nbsp;ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త మరియు ఖాన్ గ్లోబల్ స్టడీస్ &amp; ఖాన్ GS రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడు మరియు పానీ ఫౌండేషన్ CEO సత్యజిత్ భట్కల్ వివిధ సెషన్లలో పాల్గొని తమ తమ రంగాల్లో వస్తున్న మార్పులు, సవాళ్లు, భారత దేశానికి ఉన్న అవకాశాలపై చర్చిస్తారు.<br />&nbsp;<br />ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ సమ్మిట్ సాంస్కృతిక , &nbsp;సామాజిక అంశాలు, AI, సైన్స్ అండ్ టెక్నాలజీ, రాజకీయాలు , పాలన, పర్యావరణవాదం, స్థిరత్వం, వ్యాపారం , వ్యవస్థాపకత, క్రీడా సాంకేతికత, ఇన్నోవేషన్&zwnj;లలో &nbsp; ఆవిష్కరించడానికి లక్ష్యంగా పెట్టుకున్న అనేక కీలక అంశాలలో భవిష్యత్ ప్రభావాలను వక్తలు చర్చిస్తారు. భారతదేశం 'మానవత్వం యొక్క తదుపరి సరిహద్దు' వైపు ప్రపంచ ప్రయాణానికి నాయకత్వం వహిస్తున్నందున.. ఆలోచనలు, సవాళ్లు, పరిష్కారాలను సమ్మిట్ &nbsp;చూపించడానికి ప్రయత్నిస్తుంది. &nbsp;</p> <p>ABP నెట్&zwnj;వర్క్ యొక్క ఐడియాస్ ఆఫ్ ఇండియా &nbsp;ఇప్పటి వరకూ నిర్వహించిన మూడు సమ్మిట్&zwnj;లు భారత్ లోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందాయి. &nbsp;విభిన్న రంగాలలోని మేధావుల ప్రత్యేక దృక్పథాలు , అనుభవాలను &nbsp;దేశం ముందు ఉంచాయి. ఇటీవలి కాలంలో &nbsp;ప్రపంచ సంఘటనల వల్ల ఏర్పడుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం సమ్మిట్ భారతదేశం 2047 వికసిత్ భారత్ మార్గంలో వేగవంతం కావడానికి కావాల్సిన ఆలోచనలు ఈ సమ్మిట్&zwnj;లో ఆవిష్కరిస్తారు. &nbsp;వచ్చే దశాబ్దంలో ప్రపంచాన్ని తీర్చిదిద్దే ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక-ఆర్థిక , &nbsp;సాంస్కృతిక పురోగతిపై &nbsp;సమ్మిట్ లో వక్తలు దృష్టి పెడతారు. గత ఎడిషన్&zwnj;ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, నాల్గవ ఎడిషన్ దేశం మరింత వేగంగా ముందుకు సాగడానికి అవసరమయ్యే ఆలోచనలు, ఐడియాలను దేశం ముందు ఉంచేందుకు సమ్మిట్ ప్రయత్నిస్తుంది. &nbsp;</p> <p>రెండు రోజుల పాటు జరిగే &nbsp;నాల్గవ ఎడిషన్.. &nbsp;పాతుకుపోయిన.. భవిష్యత్ను &nbsp;ప్రభావితం చేసే సమస్యలు, &nbsp;పరిణామాలపై ఆలోచింప చేసే ప్రసంగాలు ఉంటాయి. 30కి పైగా సెషన్&zwnj;లు , &nbsp;50 మంది స్పీకర్లు, &nbsp;సెషన్ చైర్&zwnj;లతో, ABP నెట్&zwnj;వర్క్ యొక్క ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025 వీక్షకులందరికీ ఓ ఉన్నతమైన సమ్మిట్ అనుభూతిని కలిగిస్తుంది.&nbsp;<br />&nbsp;<br />ఈ సమ్మిట్ ఫిబ్రవరి 21-22, 2025 తేదీలలో ఉదయం 9:45 నుండి ABP నెట్&zwnj;వర్క్ &nbsp;అన్ని డిజిటల్ ప్లాట్&zwnj;ఫామ్&zwnj;లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దేశవ్యాప్తంగా &nbsp;ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు: <strong>www.abplive.com</strong><br />మరిన్ని వివరాల కోసం, అధికారిక &nbsp;మైక్రో సైట్&zwnj;ను సందర్శించవచ్చు: <strong>https://www.abpideasofindia.com/</strong></p> <p>&nbsp;</p>
Read Entire Article